యాప్నగరం

కర్నూలు: నడిరోడ్డుపై కత్తులతో వీరంగం.. వైసీపీలో రెండు వర్గాల ఫైట్, ఐదుగురికి తీవ్ర గాయాలు

పాతపేటకు చెందిన ఫరీద్‌, నాగరాజు వర్గాలు కత్తులు, రాళ్లతో ఒకరిపై మరకొరు దాడులు చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కనిపించింది. స్థానికులు భయంతో పరుగులు తీశారు.. అరగంటపాటు అక్కడ రణరంగం కనిపించింది.

Samayam Telugu 18 Jan 2021, 6:51 am
కర్నూలు జిల్లా డోన్‌‌లో నడిరోడ్డుపై కత్తులతో యువకులు రెచ్చిపోయారు. పాతపేటలో ఆదివారం సాయంత్రం వైఎస్సార్‌సీపీలోని రెండు గ్రూపులు గొడవకు దిగాయి. పాతపేటకు చెందిన ఫరీద్‌, నాగరాజు వర్గాలు కత్తులు, రాళ్లతో ఒకరిపై మరకొరు దాడులు చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కనిపించింది. స్థానికులు భయంతో పరుగులు తీశారు.. అరగంటపాటు అక్కడ రణరంగం కనిపించింది. ఈ దాడుల్లో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. కత్తిపోట్ల గాయాలు తీవ్రంగా ఉన్న నాగరాజును కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Samayam Telugu డోన్‌లో కత్తులతో


ఈ ఘర్షణకు సంబంధించిన సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అల్లరిమూకలను చెదరగొట్టారు. ఈ ఘర్షణకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొంతకాలంగా డోన్‌ పాతపేట, కొండపేట, చిగురుమానుపేట, తారకరామనగర్‌ ప్రాంతాల్లో మట్కా దందాతో పాటు తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడ స్థానికంగా ఫరీద్‌, నాగరాజు వేర్వేరు వర్గాలుగా విడిపోగా.. కొద్దిరోజులుగా వర్గపోరు నడుస్తోంది.. గతంలో కూడా గొడవలు జరిగాయి. మళ్లీ ఇద్దరు యువకులు పాత కక్షలతో వాగ్వాదానికి దిగగా.. అది పెద్ద గొడవగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.