యాప్నగరం

లేటుగా వచ్చిన తిరుమల ఎక్స్‌ప్రెస్.. ఇద్దరు స్నేహితులను పొట్టనబెట్టుకుంది..

రోజు మాదిరిగానే విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్లే ట్రాక్‌పై నడుచుకుంటూ వస్తుండగా వెనుక నుంచి రైలు ఢీకొని అక్కడికక్కడే మరణించారు. సుమారు నాలుగైదు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Samayam Telugu 20 Oct 2019, 6:08 pm
ట్రైన్ లేటుగా రావడం.. ఆ ఇద్దరి స్నేహితుల మరణానికి కారణమైంది. నిత్యం అదే బాటలో నదీతీరానికి వెళ్లి వచ్చే స్నేహితులు ఆ రోజు ట్రాక్ దాటి తిరిగి రాలేకపోయారు. ఆ సమయంలో ఏ రైళ్లూ రావన్నది వారి అభిప్రాయం. అందుకే రోజులాగే ట్రాక్‌పై నడుచుకుంటూ కృష్ణా నదీ తీరానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా రైలు ఢీకొని దుర్మరణం చెందారు. ఈ విషాద సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.
Samayam Telugu tadepalli


తాడేపల్లి పట్టణ పరిధిలోని కృష్ణా కెనాల్ జంక్షన్ సమీపంలో రైలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. తాడేపల్లికే చెందిన పరసా వెంకట సుబ్బారావు(55), వెంకటరమణ(53) నిత్యం రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ నదీ తీరానికి వెళ్లివస్తుంటారు. రోజు మాదిరిగానే విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్లే ట్రాక్‌పై నడుచుకుంటూ వస్తుండగా వెనుక నుంచి రైలు ఢీకొని అక్కడికక్కడే మరణించారు.

Also Read: తలలేని ఆ మొండెం ఎవరిదో..!

పరసా సుబ్బారావు కొలిమి పనులు చేస్తుంటాడు. వెంకటరమణ కుటుంబ కలహాలతో ఇంటిని వదిలి సుబ్బారావు వద్దనే ఉంటున్నాడు. రోజు మాదిరిగానే ఇద్దరూ రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ నదీతీరానికి వెళ్లి వస్తున్నారు. ఆ రోజు వర్షం కారణంగా లేటుగా బయటకు వచ్చారు. ఏ సమయంలో ఏ రైలు వస్తుందో వారికి తెలుసు. ఈ సమయంలో ఏ రైలు లేదని రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

Read Also: జగన్ ఇంటి సమీపంలో పేలుడు.. తాడేపల్లిలో కలకలం..

విజయవాడ నుంచి గుంటూరు రైల్వే ట్రాక్‌పై బ్రిడ్జి సమీపంలోకి రాగానే తిరుమల ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. నాలుగైదు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో స్నేహితులిద్దరూ అక్కడికక్కడే మరణించారు. సుబ్బారావు, వెంకట రమణకు చెముడు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అందువల్లే రైలు హారన్ వినిపించలేదని, ట్రాక్‌ పై నుంచి తప్పుకోకపోవడంతో రైలు ఢీ కొట్టింది.

Also Read:ఏపీ హైకోర్టు: జగన్ సర్కార్ కొత్త స్ట్రాటజీ! కేంద్రంతో సంప్రదింపులు?

ఈ రైల్వే లైనులో నడిచే ట్రైన్ వేళలు వారికి తెలుసని స్థానికులు చెబుతున్నారు. తిరుమల ఎక్స్‌ప్రెస్ లేటుగా రావడం వల్లే ప్రమాదాన్ని పసిగట్టలేకపోయినట్లు తెలుస్తోంది. అసలే చెముడు కావడంతో రైలు హారన్ కూడా వినిపించకపోవడంతో ఇద్దరూ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.