యాప్నగరం

ఇద్దరిని కత్తితో పొడిచిన ఇసుక ట్రాక్టర్ డ్రైవర్.. ఒంగోలులో దారుణం

ట్రాక్టర్ డ్రైవర్ మరో ఇద్దరు డ్రైవర్లను కత్తితో పొడిచేసిన ఘటన ఒంగోలులో కలకలం రేపింది. స్వల్ప వివాదం కత్తులతో దాడికి దారితీసింది. పార్కింగ్ విషయంలోనే తగాదా పడినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 2 Dec 2019, 8:39 pm
ప్రకాశం జిల్లా ఒంగోలు దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇసుక ట్రాక్టర్ డ్రైవర్‌ ఇద్దరిని కత్తితో పొడిచిన ఘటన కలకలం రేపింది. పార్కింగ్ విషయమై జరిగిన స్వల్ప వివాదం ప్రాణాలు తీసే వరకూ వెళ్లింది. చిన్న వివాదం చినికిచినికి కత్తులతో దాడి చేసుకునే వరకూ వెళ్లింది. ఇద్దరు డ్రైవర్లను కత్తితో పొడవడంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu anantapur


పార్కింగ్ విషయంలో వివాదం ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. ఇసుక ట్రాక్టర్ నిలిపే విషయంలో వివాదం చెలరేగి డ్రైవర్.. మరో ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లను కత్తితో పొడిచేసిన దారుణ ఘటన ఒంగోలులోని కర్నూలు రోడ్డులో జరిగింది. కర్నూల్ రోడ్డు ఫ్లై ఓవర్ కింద ఇసుక ట్రాక్టర్లు పార్కింగ్ చేస్తుంటారు. ట్రాక్టర్ పార్కింగ్ సమయంలో ముగ్గురు డ్రైవర్ల మధ్య వివాదం రేగినట్లు తెలుస్తోంది.

Also Read: ఆ ఆఫీస్‌లో లంచాలు తీసుకోరట.. బోర్డు పెట్టించిన అధికారి

ట్రాక్టర్ డ్రైవర్ మరో ఇద్దరు డ్రైవర్లను కత్తితో పొడిచేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పట్టణంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం జరగడంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.