యాప్నగరం

మంత్రి పదవుల మార్పు.. శాసన మండలి రద్దు ప్రభావమా!

రాష్ట్రంలో ఇద్దరు మంత్రుల శాఖల్లో మార్పులు జరిగాయి. మంత్రి మోపిదేవి వెంకట రమణ శాఖల్లో కోత పడింది. అలాగే మేకపాటి గౌతమ్ రెడ్డి ఓ విభాగాన్ని వేరు చేశారు.

Samayam Telugu 30 Jan 2020, 11:01 pm
రాష్ట్ర కేబినెట్‌లో ఇద్దరు మంత్రుల శాఖల్లో మార్పులు జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం (జనవరి 30) ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ నిర్వహిస్తున్న మార్కెటింగ్‌ శాఖను వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుకు అప్పగించారు.
Samayam Telugu mekapati, mopidevi, kannababu


మరో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి నిర్వహిస్తు్న్న పరిశ్రమల శాఖ నుంచి ఆహార శుద్ధి విభాగాన్ని వేరు చేసి దాన్ని కూడా కన్నబాబుకే అప్పగించారు. మార్కెటింగ్‌ శాఖను కన్నబాబుకు అప్పగించడంతో ప్రస్తుతం మోపిదేవి వద్ద పశుసంవర్ధక, మత్స్యశాఖలు మాత్రమే ఉన్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం మంత్రుల శాఖల్లో మార్పులు, చేర్పులు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Also Read: మండలి రద్దుపై పదవులు కోల్పోయే మంత్రుల స్పందన.!కాగా, మంత్రి మోపిదేవి వెంకట రమణ ప్రస్తుతం శాసన మండలి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవలే అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టగా, దీన్ని ఆమోదింపజేసి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. పార్లమెంటులో మండలి రద్దు బిల్లు పాసైతే మండలి రద్దయిపోతుంది. అప్పుడు మంత్రి మోపిదేవి వెంకట రమణతో పాటు పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం పదవులు కోల్పోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి మోపిదేవి శాఖల్లో కోత విధించడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.