యాప్నగరం

గోవాలో ఏపీ యువకుల మృతి.. సన్‌బర్న్ ఈవెంట్ కోసం వెళ్లి..!

న్యూ ఇయర్ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్‌బర్న్ ఈవెంట్ కోసం గోవా వెళ్లిన ఏపీ యువకులు. ఈవెంట్ నిర్వహించే వేదిక బయట కుప్పకూలిన ఇద్దరు యువకులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.

Samayam Telugu 28 Dec 2019, 11:30 am
గోవాలో ఏపీ యువకుల అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. న్యూ ఇయర్ వేడుకల కోసం వెళ్లిన ఇద్దరు యువకులు స్థితిలో చనిపోయారు. ఏపీకి చెందిన ఇద్దరు యువకులు గోవాలో సన్‌బర్న్ ఈవెంట్ కోసం వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం ఈవెంట్ కోసం వెగటోర్ బీచ్ సమీపంలోని వేదిక బయట నిలబడ్డారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు అక్కడే కుప్పకూలారు.. వెంటనే అప్రమత్తమైన ఈవెంట్ నిర్వాహకులు ఇద్దర్ని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటి వారు చనిపోయినట్లు డాక్టర్లు నిర్థారించారు.
Samayam Telugu Representative Image
Representative Image


నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. డ్రగ్స్ డోస్ ఎక్కువ కావడంతో చనిపోయారా.. గుండెపోటు ఏదైనా వచ్చిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్ని సాయిప్రసాద్, వెంకట కృష్ణలుగా గుర్తించారు. ఇద్దరి మృతదేహాలకు పోస్ట్‌మార్టమ్ నిర్వహిస్తే కానీ ఎలా చనిపోయారన్నది క్లారిటీ రాదని గోవా పోలీసులు చెబుతున్నారు. ఇటు ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరి వివరాల గురించి ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.