యాప్నగరం

విశాఖ: నడిరోడ్డుపై మహిళ చీరలాగి.. భర్తపై దాడి చేసిన యువకులు

ఆటో సైడ్ ఇవ్వలేదనే కోపంతో డ్రైవర్‌పై దాడి.. అడ్డుకున్న అతడి భార్యపట్ల అసభ్యకర ప్రవర్తన. రోడ్డుపైనే చీరలాగి.. కులం పేరుతో తిట్టారని మహిళ ఆరోపణలు.. విశాఖ జిల్లాలో ఘటన.

Samayam Telugu 26 Dec 2019, 9:58 am
విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో యువకులు రెచ్చిపోయారు.. దంపతులపై దాడి చేశారు. మహిళ చీరలాగి.. ఆమె భర్తపై దాడి చేశారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే జరిగిన ఈ కీచకరపర్వం జరిగింది. కోటవురట్ల మండలం యండపల్లికి చెందిన నానిబాబు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం తన భార్య, సోదరుడితో కలిసి ఆటోలో నర్సీపట్నం సొంత పనిమీద వెళుతున్నాడు.
Samayam Telugu vsp


అబీద్ సెంటర్ దగ్గర ఇద్దరు యువకులు బైక్‌పై ఆటోను ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ రోడ్డు కాస్త రద్దీగా ఉండటంతో.. ఆటో డ్రైవర్ ఆ బైక్‌కు సైడ్ ఇవ్వలేదు. దీంతో రెచ్చిపోయిన యువకులు ఆటోను ఛేజ్ చేసి ఆపారు. డ్రైవర్‌ను బయటకు లాగి దాడి చేశారు. అతడ్ని తీవ్రంగా కొడుతుండటంతో.. భార్య అడ్డుపడింది. తన భర్తను కొట్టద్దని యువకుల్ని ప్రాధేయపడింది. ఆ యువకులు మహిళపట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించారు.

మహిళ చీరను రోడ్డుపైనే లాగేశారు.. అడ్డుపడటంతో ఆమెను కులం పేరుతో దూషించారట. తర్వాత స్థానికులు భారీగా అక్కడికి చేరుకోవవడంతో యువకులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై ఆటో డ్రైవర్ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో అట్రాసిటీతో పాటూ ఇతర కేసులు నమోదు చేశారు. ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ ఇద్దరు యువకుల్ని రామకృష్ణ, నాగేశ్వరరావులుగా గుర్తించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.