యాప్నగరం

Pawan Kalyan ఫెయిలయ్యారు.. కమ్మ, రెడ్డి తప్ప మరో నాయకుడు కష్టమే: ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

ఏపీలో కుల రాజకీయాలపై ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బతికి ఉన్నంత వరకూ కమ్మ, రెడ్డి తప్ప మరో కులం నుంచి నాయకుడు వచ్చే అవకాశం ఉందనుకోవడం లేదన్నారు. 1952 ఎన్నికల నుంచి ఏపీని పరిపాలిస్తున్నది కమ్మ, రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలేనన్నారు. ఆంధ్రా ప్రాంతంలో ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గానికి చెందిన 2270 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారన్నారు. ఇప్పటి వరకూ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో రెడ్లు 27 శాతమైతే, కమ్మ 22 శాతం ఉన్నారన్నారు. రెడ్లు సీఎంగా ఉన్నా.. కమ్మ వాళ్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారన్నారు. 1994 ఎన్నికల్లో తాను గెలవడానికి బ్రాహ్మణులు తన కోసం పని చేయడమే కారణమన్నారు. 2004, 2009 ఎన్నికల్లోనూ తనకెవరో తెలియని బ్రాహ్మణులు సైతం తనకోసం పని చేశారన్నారు.

Samayam Telugu 6 Feb 2020, 5:52 pm
ఏపీలో కుల రాజకీయాలపై ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బతికి ఉన్నంత వరకూ కమ్మ, రెడ్డి తప్ప మరో కులం నుంచి నాయకుడు వచ్చే అవకాశం ఉందనుకోవడం లేదన్నారు. 1952 ఎన్నికల నుంచి ఏపీని పరిపాలిస్తున్నది కమ్మ, రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలేనన్నారు. ఆంధ్రా ప్రాంతంలో ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గానికి చెందిన 2270 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారన్నారు. ఇప్పటి వరకూ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో రెడ్లు 27 శాతమైతే, కమ్మ 22 శాతం ఉన్నారన్నారు. రెడ్లు సీఎంగా ఉన్నా.. కమ్మ వాళ్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారన్నారు. 1994 ఎన్నికల్లో తాను గెలవడానికి బ్రాహ్మణులు తన కోసం పని చేయడమే కారణమన్నారు. 2004, 2009 ఎన్నికల్లోనూ తనకెవరో తెలియని బ్రాహ్మణులు సైతం తనకోసం పని చేశారన్నారు.
Samayam Telugu undavalli arun kumar interesting comments on pawan kalyan and ap politics
Pawan Kalyan ఫెయిలయ్యారు.. కమ్మ, రెడ్డి తప్ప మరో నాయకుడు కష్టమే: ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు


పవన్, చిరంజీవి విఫలమయ్యారు..

బీసీల్లో చాలా సామాజిక వర్గాలున్నాయి. కాబట్టి బీసీల ఏకీకరణ సాధ్యం కాలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. నేను బతికి ఉన్నంత వరకు రెడ్డి, కమ్మ యేతర సామాజిక వర్గాల నుంచి మరో నాయకుడు వచ్చే అవకాశం లేదన్నారు. ఆ అవకాశాన్ని కల్పించగల సామర్థ్యం ఉన్న నేతలెవరూ లేరన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ప్రయత్నించి విఫలమయ్యారని అరుణ్ కుమార్ తెలిపారు. కమ్మ, రెడ్డి కలిపి ఎంత మంది ఉంటారో.. కాపులు అంతమంది ఉంటారని అరుణ్ కుమార్ తెలిపారు. కాపుల నుంచి కమ్మ, రెడ్డి, వెలమ కులాలు వచ్చాయన్నారు. కాపు అనేది ఓ కులం కాదన్నారు.

డబ్బున్న వాళ్లలో కులం ఫీలింగ్ వస్తే..

డబ్బున్న వాళ్లలో కులం ఫీలింగ్ వస్తే డబ్బు లేని కులాలకు ప్రమాదం అన్నారు. మన కులమే బాగుండాలన్న భావన డబ్బునవారిలో వస్తే.. డబ్బులేని వారు అభివృద్ధికి దూరం అవుతారన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడం తప్పేమీ కాదన్న ఉండవల్లి.. గతంలోనే తాను పవన్‌ను సినిమాల్లో నటించమని సూచించానన్నారు. కానీ ఆయన సినిమాలు చేయనని చెప్పారన్నారు.

కులాల మీద పుస్తకం రాయమన్నారు..

కులాల మీద ఓ పుస్తకం రాయమని ఎమ్మెస్కో విజయ్ కుమార్ సలహా ఇచ్చారని ఉండవల్లి తెలిపారు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న గొడవలు కమ్మ, రెడ్డి గొడవలుగా మారాయన్నారు. రాజధాని గురించి ఎంతో కన్ఫ్యూజన్ ఉందని అరుణ్ కుమార్ చెప్పారు. రాజధానిని అమరావతిలో పెట్టొద్దని చంద్రబాబుకు తాను లేఖలు రాశానన్నారు. కొత్త నగరం నిర్మాణం అనేది మన తాహత్తుకు సరిపోతుందా? అని ఆయన ప్రశ్నించారు. అమరావతి ప్రాంత రైతులు చేసింది త్యాగం కాదన్నారు. ప్రతిఫలం కోసమే వారు రాజధాని కోసం భూములను ఇచ్చారన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.