యాప్నగరం

భవనాన్ని ఖాళీ చేయండి.. చంద్రబాబు ఇంటికి నోటీసులు

చంద్రబాబు నివాసానికి వెళ్లిన ఉండవల్లి వీఆర్వో .. ఇల్లు వెంటనే ఖాళీ చేయాలని నోటీసులు. ఎవరూ లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న టీడీపీ అధినేత.

Samayam Telugu 17 Aug 2019, 10:42 am

ప్రధానాంశాలు:

  • కృష్ణా నది వరద ప్రవాహం ఎక్కువగా ఉంది .
    ఇల్లు ఖాళీ చేయాలని నోటీసుల్లో ప్రస్తావన.
    బాబు ఇంటి దగ్గర నీట మునిగిన పంట పొలాలు.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu babu.
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి ప్రభుత్వం మళ్లీ నోటీసులు పంపింది. ఉండవల్లి గ్రామ వీఆర్వో వెళ్లి బాబు నివాసానికి నోటీసులు అందజేశారు. కృష్ణా నది ప్రవాహం ఎక్కువగా ఉందని.. వరద ఉధృతి పెరుగుతోందని నోటీసులు ప్రస్తావించారు. వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ బాబు నివాసం దగ్గర ఎవరూ లేకపోవడంతో గోడకు అంటించి వచ్చారు.
ఇటు చంద్రబాబు ఇంటి దగ్గర పంట పొలాలు నీట మునిగాయట.. ఆ ఇంటి దగ్గర ఇసుక బస్తాలు ఏర్పాటు చేశారట.
చంద్రబాబు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. చెయ్యి నొప్పితో బాధపడుతుండటంతో.. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో ఆయన హైదరాబాద్ వెళ్లారు. ఈలోపే డ్రోన్ కెమెరా వ్యవహారం కలకలం రేపింది. ఇటు వరద ప్రవాహం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కృష్ణా నదికి వరద ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో.. బాబు ఇల్లు నీట మునుగుతుందని అధికారులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.