యాప్నగరం

YS Jagan ‌కు మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. రూ.2,234 కోట్లు..!

YS Jaganmohan Reddy: ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.

Samayam Telugu 2 Nov 2020, 10:22 pm
వైసీపీ ప్రభుత్వానికి కేంద్రంలోని మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పోలవరం ప్రాజెక్ట్‌పై గత కొద్దిరోజులుగా నెలకొన్న గందరగోళంపై కేంద్ర ఆర్థిక శాఖ ఎట్టకేలకు స్పందించింది. పోలవరం బకాయిలపై కేంద్ర ఆర్థిక శాఖ సానుకూలంగా రియాక్ట్ అయింది. ఎలాంటి షరతులు లేకుండా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన బకాయిలు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖకు కేంద్ర ఆర్థిక శాఖ మెమో పంపింది. మొత్తం రూ. 2,234.288 కోట్ల బకాయిలను చెల్లించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. పీపీఏ ప్రక్రియ పూర్తి చేయాలంటూ జలశక్తి శాఖకు కేంద్ర ఆర్థికశాఖ సూచించింది.
Samayam Telugu ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్


దీంతో పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించినట్లే కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సీఎం జగన్ లేఖ రాయడం, తాజాగా ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిళ్లు పెరిగిన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ నిధులను విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది.

కాగా, ఇటీవలే ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సైతం పలువురు పోలవరం పెండింగ్ నిధుల విడుదలకు సంబంధించి అభ్యర్థనలు అందజేశారు. దీనికి తోడు నిధులను పెండింగ్‌లో పెట్టేందుకు సాంకేతిక కారణాలు కూడా లేవు. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ సానుకూలంగా స్పందించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.