యాప్నగరం

ఏపీకి కేంద్రం నుంచి గుడ్ న్యూస్.. జగన్ సర్కార్‌కు మరో ఊరట

ఏపీకి ఇప్పటి దాకా రూ.873కోట్లు, తెలంగాణకు రూ.209.43కోట్ల వంతున విడుదల చేసినట్లు తెలిపింది. ఆర్థికపరంగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కేంద్రం ఏపీకి ఈ నిధులు విడుదల చేయడం కొంతమేరు ఊరట ఇచ్చినట్లే.

Samayam Telugu 15 Feb 2022, 5:52 am

ప్రధానాంశాలు:

  • ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి తీపి కబురు
  • పట్టణ స్థానిక సంస్థలకు డబ్బులు విడుదల
  • ఏపీకి రూ.225 కోట్లు విడుదల చేసిన కేంద్రం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu సీఎం జగన్
జగన్ సర్కార్‌కు మరో ఊరట లభించింది. పట్టణ స్థానిక సంస్థల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌, గుజరాత్‌, సిక్కిం రాష్ట్రాలకు కేంద్రం మొత్తం రూ.1154.90 కోట్లు గ్రాంటు రూపంలో విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఇందులో ఏపీకి రూ.225.60కోట్లు, బీహార్‌కు రూ.769కోట్లు, గుజరాత్‌కు రూ.165.3కోట్లు, సిక్కింకు రూ.5కోట్లు కేటాయించారు. 2021-22లో ఇప్పటి వరకు 28 రాష్ట్రాలకు రూ.9,172.63కోట్లు విడుదల చేసినట్లు ఆర్థికశాఖ తెలిపింది. ఇందులో ఏపీకి ఇప్పటి దాకా రూ.873కోట్లు, తెలంగాణకు రూ.209.43కోట్ల వంతున విడుదల చేసినట్లు తెలిపింది. ఆర్థికపరంగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కేంద్రం ఏపీకి ఈ నిధులు విడుదల చేయడం కొంతమేరు ఊరట ఇచ్చినట్లే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.