యాప్నగరం

ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేంద్రం గుడ్‌న్యూస్

వై కేటగిరి భద్రత కల్పించినట్లు బుధవారం రాత్రి తెలిసిందని.. అయితే అధికారికంగా గురువారం లెటర్ రావచ్చునని రఘురామ అంటున్నారు. సుమారు 10 మంది వరకు భద్రతా సిబ్బంది ఉంటారని చెప్పుకొచ్చారు.

Samayam Telugu 6 Aug 2020, 1:04 pm
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆయనకు వై కేటగిరి భద్రత కల్పించినట్లు తెలుస్తోంది. కేంద్రం తనకు వై కేటగిరి భద్రత కల్పించినట్లు బుధవారం రాత్రి తెలిసిందని.. అయితే అధికారికంగా గురువారం ఉత్తర్వులు వచ్చాయని రఘురామ అన్నారు. సుమారు 10 మంది వరకు భద్రతా సిబ్బంది ఉంటారని చెప్పుకొచ్చారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల నుంచి తనకు ముప్పు ఉందంటూ ఎంపీ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేంద్రం వై కేటగిరి భద్రతను కల్పించింది.
Samayam Telugu ఎంపీ రఘురామ


రఘురామ కృష్ణంరాజు ప్రస్తుతం తన నియోజకవర్గ పర్యటనపైనా స్పందించారు. కరోనా కర్ఫ్యూ అమలులో ఉందని.. ఈ సమయంలో నియోజకవర్గారినికి వెళ్లడం సరికాదన్నారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి కర్ఫ్యూ సడలింపు తర్వాత పర్యటనకు వెళతానని చెబుతున్నారు. తానిచ్చిన ఫిర్యాదుపై వాస్తవ పరిస్థితులను పరిశీలించిన తర్వాతే కేంద్రం తనకు వై కేటగిరి భద్రత కల్పిస్తోందన్నారు రఘురామకృష్ణరాజు.

ఓ ఏపీ మంత్రి, వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కొందరు రఘురామపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. కొందరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఎంపీ దిష్టి బొమ్మల్ని దగ్థం చేశారు. దీంతో ఆయన తన సొంత నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లలేకపోతున్నానని.. తనకు భద్రత కల్పించాలని కోరారు. కేంద్రమంత్రుల్ని కలిసి ఫిర్యాదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.