యాప్నగరం

పోలవరంపై కేంద్రం కీలక నిర్ణయం.. 2021లోగా!

పోలవరం ప్రాజెక్ట్‌పై రాజ్యసభలో ఎంపీ సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్రం. ప్రాజెక్ట్‌కు ఖర్చు చేసిన నిధులతో పాటూ డెడ్‌లైన్‌ వివరాలు ప్రస్తావించిన కేంద్రం.

Samayam Telugu 10 Feb 2020, 6:33 pm
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరంపై కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. ప్రాజెక్ట్‌ను 2021లోగా పూర్తి చేస్తామని తెలిపింది. వాస్తవానికి 2019నాటికి పూర్తి కావాల్సి ఉన్నా.. ఆ గడువును 2021 వరకు పెంచినట్లు ప్రకటించింది. పోలవరం వివిధ భాగాల కాంట్రాక్టు నిర్వహణ కారణాలతో గడువు పొడిగించినట్టు తెలిపింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి పోలవరం ఎప్పటిలోగా పూర్తి అవుతుందని ప్రశ్న అడగ్గా.. కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది.
Samayam Telugu polavaram


పోలవరం ప్రాజెక్ట్ కోసం రూ.3047 కోట్లు ఖర్చు చేశారని.. వీటిలో కేంద్రం నుంచి రూ.1400 కోట్లు నిధులు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తాము ఖర్చు చేసిన నిధులకు సంబంధించి ఆడిట్ రిపోర్టును అందిస్తేనే నిధులను విడుదల చేస్తామని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుల ఆడిట్ జరగకుండా నిధులు విడుదల చేసే ప్రసక్తే లేదని ఆర్థికశాఖ నవంబర్ 26, 2019న నోట్ ఇచ్చినట్టు గుర్తు చేసింది.

ఏపీ ప్రభుత్వం కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ 2021నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని చెబుతోంది. ఇప్పటికే రివర్స్ టెండరింగ్ చేపట్టింది.. పనుల్ని కూడా ముమ్మరం చేసింది. అలాగే పోలవరం పనులు ఆగిపోయాయంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఇరిగేషన్ మంత్రి అనిల్‌కుమార్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని.. పోలవరం పునరావాస సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.