యాప్నగరం

AP Capital: జగన్ సర్కార్‌కు బీజేపీ షాక్.. ఇదీ అసలు మ్యాటర్

కేంద్రంపై జగన్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తోంది. మూడు రాజధానులు ఏపక్షంగా తరలిస్తున్నారు.. ఈ మూర్ఖపు నిర్ణక్ష్ాన్ని సమర్థించుకోలేక కేంద్రంతో చర్చించామని చెబుతున్నారన్న సునీల్, పవన్ కళ్యాణ్.

Samayam Telugu 20 Jan 2020, 10:12 am
ఏపీ రాజధాని వ్యవహారం పొలిటికల్ హీట్ పెంచుతోంది. వైఎస్సార్‌సీపీ మినహా అన్ని పార్టీలు అమరావతికి జైకొడుతున్నాయి.. బీజేపీ కూడా ఇటీవలే తీర్మానం చేసింది. ఒక్క రాజధాని ఉండాలని.. అది కూడా అమరావతి అని తేల్చేసింది. ఈ అంశంలో తమపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆ పార్టీ చెబుతోంది. జగన్ సర్కార్ రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయానికి కేంద్రం మద్దతు ఉందని చెబుతున్నారని.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దియోధర్.
Samayam Telugu cm


Read Also: పవన్‌కు జనసేన ఎమ్మెల్యే షాక్.. జగన్‌కే రాపాక మద్దతు

ట్విట్టర్‌లో స్పందించిన సునీల్.. ‘అమరావతి నుంచి రాజధానిని తరలించాలని ఏకపక్షంగా వ్యవహరిస్తున్న జగన్ ప్రభుత్వ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తాము తీసుకునే మూర్ఖపు నిర్ణయాన్ని సమర్ధించుకోలేక దానిపై కేంద్రంతో చర్చించామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అటు చంద్రబాబు.. ఇటు వైఎస్ జగన్ అబద్ధాల ప్రచారంలో దొందూ-దొందే’అంటూ హెచ్చరించారు.
ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే అంశంపై ట్వీట్ చేశారు. దియోధర్ ట్వీట్‌ను ప్రస్తావిస్తూ.. అమరావతి నుంచి రాజధాని తరలింపు విషయంలో కేంద్రానికి చెప్పే జరుగుతోందని.. అధికార, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదు. దీన్న తీవ్రంగా ఖండిస్తున్నాము అన్నారు పవన్ కళ్యాణ్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.