యాప్నగరం

జగన్ సర్కార్‌కు కేంద్రం నుంచి శుభవార్త.. లైన్ క్లియర్, త్వరలోనే

జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ), పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ల ద్వారా నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనుంది. వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ అవుతాయి.

Samayam Telugu 28 Nov 2020, 8:07 am
జగన్ సర్కార్‌కు కేంద్రం తీపి కబురు చెప్పింది. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో కేంద్రం తరఫున రీయింబర్స్‌మెంట్‌ నిమిత్తం రూ.2,234.288 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు నాబార్డు డీజీఎం వికాశ్‌ భట్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ), పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ల ద్వారా నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనుంది. వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ అవుతాయి.
Samayam Telugu union govt to reimburse rs 2234 crore to polavaram project
జగన్ సర్కార్‌కు కేంద్రం నుంచి శుభవార్త.. లైన్ క్లియర్, త్వరలోనే


ఈ రూ.2,234.288 కోట్ల రీయింబర్స్‌మెంట్‌ కోసం కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జల్‌ శక్తి శాఖ ప్రతిపాదనలు పంపింది. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే వరకు.. అంటే 2016 సెప్టెంబర్‌ 8 వరకు పోలవరానికి కేంద్రం బడ్జెట్‌లో నిధులు కేటాయించి విడుదల చేసేది. ఆ తర్వాత నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే సమయంలో నాబార్డు నుంచి రుణం తీసుకుని పోలవరానికి నిధులిస్తామని ట్విస్ట్ ఇచ్చారు. అప్పటినుంచి అదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్‌ చేస్తూ వస్తోంది.

పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు రాష్ట్ర ప్రభుత్వం రూ.4,730.71 కోట్లను ఖర్చు చేసింది. విభజన చట్టం ప్రకారం 2014 ఏప్రిల్‌ 1 తర్వాత ప్రాజెక్టు నీటిపారుదల విభాగానికయ్యే వంద శాతం వ్యయాన్ని కేంద్రమే భరించాలి. 2014 ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.12,529.42 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో రూ.8,614.16 కోట్లను నాబార్డు రీయింబర్స్‌ చేస్తూ ఎన్‌డబ్ల్యూడీఏ, పీపీఏలకు విడుదల చేసింది. అందులో పీపీఏ రూ.8,507.26 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది. మిగతా రూ.4,022.16 కోట్లను రీయింబర్స్‌ చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇందులో రూ.2,234.288 కోట్లను రీయింబర్స్‌ చేయాలని నాబార్డును కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. కష్ట సమయంలో ఈ నిధుల విడుదల భారీ ఊరటగానే చెప్పాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.