ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ఫోన్ చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్తో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పెద్దఎత్తున కరోనా పరీక్షలు నిర్వహించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని ఈ సందర్భంగా సీఎం జగన్ వివరించారు. రోజుకు 22 వేలకు పైగా టెస్టులు జరుపుతున్నామన్నారు.
కరోనా వ్యాధి లక్షణాలను ముందుగా గుర్తించి, బాధితులకు త్వరితగతిన చికిత్స అందిస్తున్నామని కేంద్ర మంత్రికి సీఎం జగన్ తెలిపారు. ప్రస్తుతం 1.17 శాతంగా ఉన్న మరణాల రేటును 1 శాతం కంటే దిగువకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సీఎం జగన్ వివరించారని హర్షవర్ధన్ తెలిపారు. కోవిడ్పై పోరుకు కేంద్ర ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్కు రూ.179 కోట్లు ఇచ్చినట్లు హర్షవర్ధన్ వెల్లడించారు.
కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగా సీఎం జగన్తో ఇవాళ మాట్లాడారు. అంతకుముందు కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో ఆయన మాట్లాడారు.
కాగా, ఏపీలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్లో మరోసారి రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అలాగే రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి. ఒకే రోజు ఏకంగా 44 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 22,197 మందికి పరీక్షలు నిర్వహించగా ఏకంగా 2,412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 20 మందికి వైరస్ సోకింది. దీంతో ఒక్క రోజే మొత్తం కేసులు 2,432కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 35,451కు చేరింది.
కరోనా వ్యాధి లక్షణాలను ముందుగా గుర్తించి, బాధితులకు త్వరితగతిన చికిత్స అందిస్తున్నామని కేంద్ర మంత్రికి సీఎం జగన్ తెలిపారు. ప్రస్తుతం 1.17 శాతంగా ఉన్న మరణాల రేటును 1 శాతం కంటే దిగువకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సీఎం జగన్ వివరించారని హర్షవర్ధన్ తెలిపారు. కోవిడ్పై పోరుకు కేంద్ర ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్కు రూ.179 కోట్లు ఇచ్చినట్లు హర్షవర్ధన్ వెల్లడించారు.
కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగా సీఎం జగన్తో ఇవాళ మాట్లాడారు. అంతకుముందు కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో ఆయన మాట్లాడారు.
కాగా, ఏపీలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్లో మరోసారి రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అలాగే రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి. ఒకే రోజు ఏకంగా 44 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 22,197 మందికి పరీక్షలు నిర్వహించగా ఏకంగా 2,412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 20 మందికి వైరస్ సోకింది. దీంతో ఒక్క రోజే మొత్తం కేసులు 2,432కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 35,451కు చేరింది.