యాప్నగరం

Andhra లో విగ్రహాల ధ్వంసంపై ఊహించని ట్విస్ట్: రంగంలోకి అమిత్ షా.. సోము వీర్రాజుకు ఫోన్!

Somu Veerraju: రామతీర్థం రాముడి విగ్రహం ధ్వంసం ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏకంగా అమిత్ షా రంగంలోకి దిగారు.

Samayam Telugu 6 Jan 2021, 11:03 am
ఆంధ్రప్రదేశ్‌లో దేవుళ్ల విగ్రహాల ధ్వంసం వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. హిందూ దేవుళ్ల విగ్రహాల ధ్వంసం వ్యవహారం ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ రంగు పులుముకోగా.. తాజాగా, ఈ వివాదం ఢిల్లీ స్థాయికి చేరుకుంది. విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఫోన్ చేశారు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే రామతీర్థం ఘటనపై అమిత్‌ షా ఆరా తీసినట్లు తెలుస్తోంది. మరో వైపు సోము వీర్రాజు నేతృత్వంలో జనసేన కార్యకర్తలతో కలిసి మంగళవారం రామతీర్థం సందర్శనకు వెళ్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు.
Samayam Telugu అమిత్ షా


ఈ సందర్భంగా సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిరంకుశ విధానాలకు ఇది పరాకాష్టగా నిలిచిందని మండిపడ్డారు. రాష్ట్రంలో హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని, అన్యమత ప్రచారం పెరిగిపోయిందని దుయ్యబట్టారు. ఇందులో భాగంగానే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు.

దేవాలయాలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలు అవలంభిస్తోందని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆరోపించారు. కంటితుడుపు చర్యగా మాత్రమే వైసీపీ సర్కారు స్పందించిదని.. దోషులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. పోలీసు వ్యవస్థ ప్రభుత్వ కనుసన్నుల్లో పని చేస్తోందన్నారు. ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని చెప్పారు. గతవారం టీడీపీ, వైసీపీలు పోటాపోటీగా రామతీర్థం సందర్శనకు వచ్చాయన్నారు. అయితే తమను మాత్రం నిర్బంధించడం అమానుషమని దుయ్యబట్టారు. కాగా, రామతీర్థం వ్యవహారం పెద్ద దుమారం రేపుతున్న తరుణంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎలా రియాక్ట్ అవుతారోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.