యాప్నగరం

AP సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌కి షాక్.. కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు

రాజద్రోహం కేసులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అరెస్టైనప్పటి నుంచి సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్‌పై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన సర్వీస్ నిబంధనలు ఉల్లంఘిస్తూ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని రఘురామ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు.

Samayam Telugu 3 Jul 2021, 9:33 pm
ఏపీ సీఐడీ ఏడీజీ పీవీ సునీల్ కుమార్‌కి కేంద్ర హోం శాఖ షాకిచ్చింది. ఆయనపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన హోం శాఖ.. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కి లేఖ రాసింది. ఏడీజీ సునీల్ కుమార్ సివిల్ సర్వీసెస్ రూల్స్ ఉల్లంఘించారని.. మతవిద్వేషపూరిత ప్రసంగాలు చేశారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామతో సహా లీగల్ రైట్స్ సంస్థ ఇటీవల కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. సునీల్ కుమార్‌పై వచ్చిన మూడు ఫిర్యాదులను పరిశీలించిన కేంద్ర హోం శాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై వచ్చిన ఫిర్యాదులు, ప్రసంగ వీడియోలను పంపింది. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో తమకు తెలియజేయాలని హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే సునీల్ కుమార్ ప్రసంగ వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
pv sunil kumar


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.