యాప్నగరం

ఆంధ్రులకు ఎర్ర బస్సు తప్ప రైలంటే తెలియదు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎర్రబస్సు తప్ప రైల్వే అంటే తెలియదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయ్యాకే తెలుగు రాష్ట్రాల్లో అనేక రైళ్లు ప్రారంభించారన్నారు.

Samayam Telugu 18 Feb 2020, 9:05 pm
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వే అంటే అలవాటు లేదని, అసలు రైలు అంటే తెలియదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర, తెలంగాణ ప్రజలకు ఎర్రబస్సులు తప్ప రైల్వే అంటేనే తెలియదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయ్యాకే తెలుగు రాష్ట్రాల్లో అనేక కొత్త రైళ్లు ప్రారంభించారని తెలిపారు.
Samayam Telugu kishan reddy


Also Read: జగన్ సర్కార్‌కు షాక్.. గవర్నర్‌తో మండలి చైర్మన్ కీలక భేటీ

తెలుగు రాష్ట్రాల్లోని 427 రైల్వే స్టేషన్లలో హైస్పీడ్ వైఫై సౌకర్యం కల్పించారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి పీయుశ్ గోయల్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లోని చర్లపల్లి స్టేషన్‌లో శాటిలైట్ టెర్మినల్ నిర్మాణం సహా గుంతకల్లు-నంద్యాల మధ్య ఎలక్ట్రిక్ డబుల్ లైన్ సేవలను ప్రారంభించారు.

Also Read: వైసీపీ నుంచి రాజ్యసభకు ఆ ముగ్గురు..! నాలుగో బెర్త్ ఆయనకేనా?

ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైల్వే ప్రాజెక్టుల విషయంలో దక్షిణ భారతాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఉత్తరాది మాత్రమే కాకుండా ఇక్కడ కూడా కొత్త ప్రాజెక్టులపై కేంద్రం దృష్టి పెట్టాలని తలసాని కోరారు. అయితే తలసాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రజలకు ఎర్ర బస్సులు తప్ప రైల్వేనే తెలియదని వ్యాఖ్యానించారు.

Also Read: అమరావతిలో భూములు కొన్న అనంతపురం పేదలు! ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ దూకుడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.