యాప్నగరం

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం.. మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం

Andhra Pradesh: ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని.. మరోసారి పార్లమెంటులో కేంద్రం తేల్చి చెప్పింది. ఏపీకి ప్రత్యేక హోదా లేదని పరోక్షంగా స్పష్టం చేసింది. 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రమంత్రి నిత్యానందరాయ్ వివరించారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 21 Mar 2023, 5:13 pm

ప్రధానాంశాలు:

  • ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమన్న కేంద్రం
  • ఏపీకి ప్రత్యేక హోదా లేనట్లేనని కేంద్రమంత్రి స్పష్టం
  • వైసీపీ ఎంపీల ప్రశ్నలకు కేంద్రం సమాధానం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Special status for AP
ఏపీకి ప్రత్యేక హోదా
Andhra Pradesh రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేనట్లేనని.. అది ముగిసిన అధ్యాయమని.. పార్లమెంటు సాక్షిగా కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. మంగళవారం లోక్‌సభలో వైసీపి ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరీ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ (Nityanand Rai) సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటు భర్తీకి.. 14వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించిందని నిత్యానందరాయ్ వివరించారు. దీంతో ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాలకు మధ్య తేడా లేకుండా పోయిందన్నారు. ప్రత్యేక హోదాకు బదులుగా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించామని.. ఆ ప్యాకేజీ కింద వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేశామని నిత్యానందరాయ్ వివరించారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.