యాప్నగరం

సీఎం జగన్‌కు అమిత్ షా, రాజ్‌నాథ్ ఫోన్.. కీలక అంశాలపై చర్చ

తాజా పరిణామాలతో పాటూ పలు కీలక అంశాలపై ఇద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు, తాజా పరిస్థితులపైనా అమిత్ షా ఆరా తీసినట్లు సమాచారం.

Samayam Telugu 18 Jun 2020, 6:43 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. గురువారం సాయంత్రం సీఎంతో షా ఫోన్‌లో మాట్లాడారు.. తాజా పరిణామాలతో పాటూ పలు కీలక అంశాలపై ఇద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు, తాజా పరిస్థితులపైనా అమిత్ షా ఆరా తీసినట్లు సమాచారం. అంతేకాదు శుక్రవారం రాజ్యసభ ఎన్నికలు కూడా ఉన్న సమయంలో ఫోన్ చేయడం ఆసక్తికరంగా మారింది.
Samayam Telugu సీఎం జగన్‌కు షా ఫోన్


మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా ఫోన్ చేశారు. శుక్రవారం సాయంత్రం జరిగే అఖిలపక్ష సమావేశంపై చర్చించినట్లు తెలుస్తోంది. శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీతో జరగనున్న అఖిలపక్ష సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడి హోదాలో జగన్ పాల్గొనున్నారు. ఈ అంశంపైనే రాజనాథ్ సీఎం జగన్‌తో చర్చించినట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.