యాప్నగరం

ఏలూరు: బ్యాంక్ అకౌంట్‌ నుంచి స్మార్ట్‌గా దోపిడీ.. పోలీసులకే దిమ్మ తిరిగింది

డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నం చేయగా.. అకౌంట్‌లో డబ్బులు డ్రా చేసినట్లు బ్యాంకు సిబ్బంది చెప్పడంతో షాక్ తిన్నారు. వెంటనే వారు బ్యాంక్ మెనేజర్‌ను స్పందించడంతో.. జూన్‌ నెల నుంచీ ఏటీఎం ద్వారా 28సార్లు డబ్బును ఎవరో డ్రా చేసినట్లు చెప్పారు.

Samayam Telugu 10 Aug 2020, 11:28 am
కరోనా సమయంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త, కొత్త మార్గాల్లో స్మార్ట్‌గా అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు కూడా తెలియకుండా డబ్బు మాయం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన ఈ ఘటన కలకలంరేపింది. నగరంలోని త్రీటౌన్‌ పరిధిలో ఉన్న విద్యానగర్‌కు చెందిన గుమ్మళ్ళ రాజేష్‌ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. ఆయన ఇటీవల చనిపోడంతో.. ఆయనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బు అకౌంట్లో జమయ్యాయి.
Samayam Telugu unknown person withdraw money from other account in eluru west godavari district
ఏలూరు: బ్యాంక్ అకౌంట్‌ నుంచి స్మార్ట్‌గా దోపిడీ.. పోలీసులకే దిమ్మ తిరిగింది


తండ్రి రాయితీ డబ్బులు తల్లి బ్యాంకు అక్కౌంట్‌లో జమ కావడంతో.. ఈ సొమ్మును బ్యాంకు నుంచి విత్‌డ్రా చేసుకునేందుకు ఈనెల 7న రాజేష్‌ తన తల్లిని తీసుకుని బ్యాంకుకు వెళ్లాడు. డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నం చేయగా.. అకౌంట్‌లో డబ్బులు డ్రా చేసినట్లు బ్యాంకు సిబ్బంది చెప్పడంతో షాక్ తిన్నారు. వెంటనే వారు బ్యాంక్ మెనేజర్‌ను స్పందించడంతో.. జూన్‌ నెల నుంచీ ఏటీఎం ద్వారా 28సార్లు డబ్బును ఎవరో డ్రా చేసినట్లు చెప్పారు. బాధితులు వెంటనే ఏలూరు త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజేష్ తల్లి అకౌంట్‌లో నుంచి డబ్బును సైబర్ నేరగాళ్లు మాయం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఆ డబ్బును ఎలా డ్రా చేశారో ఆరా తీస్తున్నారు. బ్యాంక్ అధికారుల నుంచి సమాచారం తీసుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.