కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరాన్ని అరెస్ట్ చేసిన సీబీఐ.. ఐదు రోజులపాటు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అటు సీబీఐ, ఇటు ఈడీ.. మొత్తానికి ఆయన చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుస్తోంది. యూపీఏ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆయనకు ఐఎన్ఎక్స్ మీడియా కేసు వ్యవహారం తలనొప్పిగా మారింది. ఈ కేసులో సీబీఐ హైడ్రామా మధ్య చిదంబరాన్ని అరెస్ట్ చేయగానే.. తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా వార్ మొదలైంది. తర్వాతి టార్గెట్ చిదంబరం మిత్రుడు చంద్రబాబే అని
విమానంలో రామోజీ రావు, చంద్రబాబు భార్య భువనేశ్వరితో కలిసి ప్రయాణం చేస్తున్న సమయంలో వారిద్దరితో కలిసి ఓ మహిళ దిగిన ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. చిదంబరాన్ని విడిపించడానికి ఆయన భార్యతో కలిసి వీరిద్దరూ ఢిల్లీ వెళ్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ అభిమానులు సెటైర్లు వేశారు.
కానీ ఆ ఫొటోలో ఉంది నళినీ చిదంబరం కాదు బాబోయ్.. అది నేనేనంటూ వనజా చల్లగుల్ల అనే మహిళ వాపోయారు. ఇలా అనుమతి లేకుండా సాటి ఆడపడుచు ఫొటోను తప్పుడు ప్రచారానికి వాడటం సరికాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కొందరు ఆ ఫొటోను డిలీట్ చేశారు. తప్పుగా భావించామని చెప్పారు. ఇక్కడితో వివాదం ముగిసేదే. కానీ మిగతా వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ ఆ ప్రచారాన్ని ఆపలేదు.
చివరికి టీడీపీ జాతీయకార్యదర్శి నారా లోకేష్ ఈ విషయమై ట్వీట్ చేశారు. జగన్ బ్యాచ్ పరువు పోగొట్టుకుందని సెటైర్లు వేసిన ఆయన వనజ పెట్టిన పోస్టును జత చేశారు. పేటీఎం బ్యాచ్ ఈ విధంగా తప్పుడు పోస్టులు పెట్టి జఫ్పాలు అయ్యారంటూ లోకేశ్ విమర్శలు గుప్పించారు.