యాప్నగరం

బొండా ఉమా ఇంటికి వెళ్లిన వంగవీటి రాధా.. ఏంటి మ్యాటర్!

బొండా ఉమామహేశ్వరరావును కలిసిన వంగవీటి రాధా.. గంటసేపు చర్చలు. చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వంగవీటి. తన అనుచరుల కోసం కలిశారట.

Samayam Telugu 10 Mar 2020, 11:23 am
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా టీడీపీ సీనియర్ నేత బొండా ఉమామహేశ్వరరావుతో సమావేశమయ్యారు. మొగల్రాజపురంలోని ఉమా ఇంటికి వెళ్లిన రాధా.. దాదాపు గంటసేపు తాజా రాజకీయ పరిస్థితులు, పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వంగవీటి రాధా బొండా ఉమాను కలవడం ఆసక్తిరేపింది.
Samayam Telugu radha


ఇదిలా ఉంటే.. విజయవాడ సెంట్రల్ నియోజవర్గంలో డివిజన్ల వారీగా టికెట్లు ఆశిస్తున్న వారు ఉమా ఇంటికి వెళుతున్నారు. టీడీపీ నియోజకవర్గంలో బలమైన నాయకుల వేటలో ఉంది.. అధికార పార్టీని సమర్థవంతంగా ఎదుర్కొని నియోజవర్గంలో ఎక్కువ కార్పొరేటర్‌ స్థానాలను కైవసం చేసుకోవాలని ఉమా పట్టుదలతో ఉన్నారు. ఆ దిశగానే స్థానిక నేతలతో చర్చించి.. అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టారు.

వంగవీటి రాధా కూడా సెంట్రల్‌ నియోజకవర్గం కావడంతో బొండా ఉమా ఇంటికి వెళ్లారని.. కార్పొరేషన్ ఎన్నికల టికెట్ల కేటాయింపుపై చర్చించారని తెలుస్తోంది. తన అనుచరుల్లో కూడా కొంతమందికి టికెట్లు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ పార్టీ గెలుపు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారని సమాచారం అందుతోంది. రాధా మళ్లీ యాక్టివ్ కావడంతో టీడీపీ కేడర్ కూడా జోష్‌లో ఉంది.

వంగవీటి రాధా 2014 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ పెద్దగా బయటకు రాలేదు. తర్వాత కొద్దిరోజులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలవడంతో ఆ పార్టీలోకి వెళతారనే ప్రచారం జరిగింది. తర్వాత అమరావతి ఉద్యమం సమయంలో చంద్రబాబును విజయవాడలో పోలీసులు అరెస్ట్ చేయడంతో.. రాధా బాబు ఇంటికి వెళ్లా కలిశారు. తర్వాత అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్నారు.. రైతులకు అండగా ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.