యాప్నగరం

టీడీపీ ఎమ్మెల్యేకు ఉపరాష్ట్రపతి ఫోన్

టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిపై ఆరా తీశారు.. ఎమ్మెల్యే ఉపరాష్ట్రపతి వెంకయ్య దృష్టికి కొన్ని విషయాలు తీసుకు వెళ్ళారు.

Samayam Telugu 30 Apr 2020, 8:45 am
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫోన్ చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిపై ఆరా తీశారు.. రాజమండ్రిలో ఏన్ని కేసులు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని గోరంట్ల సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.నియోజకవర్గంలో స్వచ్చందంగా పేద కార్మిక వర్గాలకి సాయం అందించడాన్ని ఉపరాష్ట్రపతి అభినందించారు.
Samayam Telugu వెంకయ్య నాయుడు (File Photo)


ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఉపరాష్ట్రపతి వెంకయ్య దృష్టికి కొన్ని విషయాలు తీసుకు వెళ్ళారు. రాష్ట్రంలో రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నారని కొన్ని కూరగాయలు, పండ్లు మార్కెట్‌కి తీసుకువచ్చే మార్గం లేక పండించిన పంటను ఎవరికి ఉపమోగపడక రోడ్డు పాలు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పంటకు రవాణా, మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని రైతులు కోరుతున్నారన్నారు. రైతులకు న్యాయం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం చోరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే ప్రజల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని.. దాదాపు రాష్ట్రంలో అన్ని చోట్లా దాతల సహకారంతో చాలా వరకు సేవలందిస్తున్నారని చెప్పారట. ముఖ్యంగా అసంఘటిత కార్మికులు నష్టపోయారన్నారు. దీనిపై స్పందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య రోజువారీ కూలీలు కార్మికులు రైతులకి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని వ్యాఖ్యానించారట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.