యాప్నగరం

మూడు రాజధానుల ప్రకటన.. ఉపరాష్ట్రపతి వెంకయ్య సంచలన వ్యాఖ్యలు

మూడు రాజధానుల ప్రకటనపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. పాలన ఒక్కచోటే ఉండాలని.. సీఎం, పాలనా, యంత్రాంగం, హైకోర్టు, అసెంబ్లీ ఒకే ప్రాంతంలో ఉంటే మంచిదన్న ఉపరాష్ట్రపతి.

Samayam Telugu 25 Dec 2019, 10:47 am
ఏపీకి మూడు రాజధానుల ప్రకటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆత్కూర్ స్వర్ణభాతర్ ట్రస్ట్‌లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన ఆయన.. ఆసక్తికర విషయాలు చెప్పారు. రాజధాని రైతులు తనను కలిశారని.. వారి ఆవేదనను తెలియజేశారన్నారు. వారి భావోద్వేగం చూసి తనకు ఎంతో బాధ కలిగింది అన్నారు. పాలన ఒక్కచోటే ఉండాలన్నది తన అభిప్రాయమని.. సీఎం, పాలనా, యంత్రాంగం, హైకోర్టు, అసెంబ్లీ ఒక్కచోటే ఉండాలి అన్నారు. అన్నీ ఒక్కచోట ఉంటేనే పాలనలో సౌలభ్యం ఉంటుందని వ్యాఖ్యానించారు.
Samayam Telugu venkaiah


Read Also: తండ్రి కోరిక విని ఏపీ మంత్రి భావోద్వేగం.. కళ్లు తుడుచుకొని..

తన అనుభవంతోనే ఈ విషయాన్ని చెబుతున్నానని.. దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దన్నారు వెంకయ్య. కేంద్రం తన అభిప్రాయం తీసుకుంటే ఇదే చెబుతానని.. వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. అన్ని జిల్లాల్లో కేంద్ర సంస్థలు ఏర్పాటు చేయాలన్నారు ఉపరాష్ట్రపతి. వెంకయ్య చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

మంగళవారం అమరావతి రైతులు వెంకయ్యను కలిశారు. తమ సమస్యల్ని ఆయనకు చెప్పుకున్నారు. దీనిపై స్పందించిన ఆయన.. తాను చేయాల్సింది చేస్తానని.. చెప్పాల్సిన వాళ్లతో చెబుతానని హామీ ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా మూడు రాజధానుల ప్రకటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.