యాప్నగరం

ఏపీ, ఒడిశా సీఎంల వీడియో కాన్ఫరెన్స్.. వారి తరలింపుపై కీలక చర్చలు

వలస కార్మికుల తరలింపుపై ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం పాల్గొన్నారు.

Samayam Telugu 2 May 2020, 2:29 pm
వలస కార్మికుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక చర్చలు జరిపారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మధ్య శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ జరిగింది. లాక్‌ డౌన్‌ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో చిక్కుకుపోయిన ఒడిశా వలస కూలీలు, కార్మికుల తరలింపుపై వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. అలాగే ఒడిశాలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ పౌరులను తరలించే విషయమై కూడా చర్చించారు.
Samayam Telugu సీఎం జగన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్


ఈ సందర్భంగా తమ రాష్ట్రానికి చెందిన వలస కూలీలు, కార్మికులకు మంచి వసతి, భోజన సదుపాయాలు కల్పించి ఆదుకున్నందుకు గాను సీఎం వైఎస్‌ జగన్‌కు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం చొరవతో గుజరాత్‌లో చిక్కుకున్న మత్స్యకారులు సొంతూళ్లకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.