యాప్నగరం

విజయవాడ: రోడ్డు ప్రమాదంలో వీడియో జర్నలిస్ట్ మృతి.. ఏపీ మంత్రుల సంతాపం

బైక్‌ను వెనుక నుంచి వచ్చి ఢీకొట్టిన లారీ.. అక్కడికక్కడే చనిపోయిన వీడియో జర్నలిస్ట్ మురళి. జర్నలిస్ట్ మరణంపై ఏపీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్.. డీజీపీ గౌతమ్ సవాంగ్ దిగ్భ్రాంతి.

Samayam Telugu 30 Sep 2019, 12:23 pm

ప్రధానాంశాలు:

  • విజయవాడ బెంజ్ సర్కిల్‌లో ప్రమాదం
  • అక్కడికక్కడే చనిపోయిన మురళి
  • మురళి కుటుంబానికి మంత్రుల సానుభూతి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu tv9.
విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. జ్యోతి మహల్ దగ్గర బైక్‌ను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో టీవీ9 న్యూస్ ఛానల్‌లో పనిచేస్తున్న సీనియర్ వీడియో జర్నలిస్ట్ మురళి చనిపోయారు. బైక్‌పై రోడ్డు దాటుతుండగా లారీ వచ్చి ఢీకొట్టింది. స్థానికులు మురళిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు.. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు.
Read Also: తూ.గో: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 12మందికి తీవ్ర గాయాలు

వీడియో జర్నలిస్ట్ మురళి విజయవాడలో విధులు నిర్వహిస్తున్నారు. మురళి మృతిపై రాష్ట్ర సమాచార, రవాణా శాఖమంత్రి పేర్ని నాని.. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మురళి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌ కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.