యాప్నగరం

నిప్పు కణికలపై ఐటీ దాడులేంటి?: బాబుపై విజయసాయి సెటైర్లు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. తన సన్నిహితుల ఐటీ దాడులపై బాబు నోరు మెదపడం లేదన్నారు.

Samayam Telugu 8 Feb 2020, 10:18 am
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టార్గెట్‌గా విమర్శలు గుప్పించడంలో విజయసాయి రెడ్డి ముందుంటారు. ఏ మాత్రం టైం దొరికినా చాలు.. బాబుపై సెటైర్లు వేస్తూ ట్వీట్లు పెడుతుంటారు. ఇటీవల చంద్రబాబు సన్నిహితుల నివాసాలపై ఐటీ శాఖ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై వైఎస్సార్సీపీ ఎంపీ స్పందించారు. తన సన్నిహితులపై ఐటీ దాడుల విషయమై బాబు నోరు విప్పడం లేదని.. కియా తరలి వెళ్తోందనే ఫేక్ వార్తలతో జనం దృష్టిని మళ్లించే యత్నం చేస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు.
Samayam Telugu vijayasai babu


‘‘మాజీ పీఏతోపాటు తాను పెంచి పోషించిన అవినీతి సర్పాలపై జరుగుతున్న ఐటీ సోదాలపై చంద్రబాబు నోరువిప్పడం లేదు. నిప్పు కణికల్లాంటి వారిపై ఈ దాడులేంటని ఐటీ శాఖను నిలదీయాలి. రెండ్రోజులుగా కిక్కురుమనకుండా, కియా లేచిపోతోందని ఫేక్ వార్తలతో ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నాడ’’ని ఆయన ట్వీట్ చేశారు.
‘‘బంగాళాఖాతం తీరం నుంచి దూరంగా జరిగిపోతోంది. నదులన్నీ వెనక్కి ప్రవహస్తున్నాయి. ఆఫ్రికా నుంచి మిడతల దండు ఇటే వస్తోంది. ఆంధ్రా వైపు భారీ గ్రహ శకలం దూసుకొస్తున్నట్టు నాసా హెచ్చరించింది లాంటి వార్తలు వస్తాయి త్వరలో. చంద్రబాబూ, ఐదు కోట్ల మంది ప్రజలతో గేమ్స్ ఆడుతున్నావ్!’’ అని విజయసాయి రెడ్డి మరో ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.