యాప్నగరం

ఏం తెలుసో చెప్పు చిట్టినాయుడు.. వైసీపీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు

నాలుగు నెలల కిందట చనిపోతే ఉద్యోగం రాలేదని ఇప్పుడే చనిపోయాడంటూ లేఖ రాయడమేంటి అంటూ టీడీపీ నేత నారా లోకేష్‌పై విజయసాయి ఓ రేంజ్‌లో సెటైర్లు వేశారు. మాలోకం అంటూ రెచ్చిపోయారు.

Samayam Telugu 7 Jul 2021, 6:14 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌పై మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. నిరుద్యోగ సమస్యతో యువకుడు చనిపోయాడంటూ లోకేష్ డ్రామాకు తెరతీశాడని ఆయన ఆరోపించారు. ఆరు నెలల కిందట చనిపోయిన యువకుడు గోపాల్.. ఉద్యోగం లేక చనిపోయాడని లేఖలు తయారు చేయించి డ్రామాలు ఆడాడని విజయసాయి అన్నారు. ఆర్నెళ్ల కిందట చనిపోతే ఇప్పుడే చనిపోయినట్లు ఉత్తరాలు రాయించడమేంటయ్యా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
lokesh


తండ్రిని మించిన కొడుకు అనిపించుకోవాలని మాలోకానికి ఒకటే ఆరాటంగా ఉందంటూ విజయసాయి ఎద్దేవా చేశారు. అందుకేనేమో తనకు తెలియనివి, అవగాహనలేని విషయాలపై పిచ్చపిచ్చగా బొంకుతున్నాడంటూ విమర్శించారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల గురించి నీకేం తెలుసో స్పష్టంగా చెప్పు చిట్టి నాయుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎంపీ. గాలి మాటలు మాట్లాడకుండా ముందు నీ తండ్రితో మాట్లాడించు అంటూ హితవు పలికారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.