యాప్నగరం

విజయవాడ కోవిడ్ సెంటర్ దుర్ఘటనలో కీలక పరిణామం.. ముగ్గురి అరెస్ట్

విజయవాడలోని కోవిడ్ కేర్ సెంటర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.

Samayam Telugu 10 Aug 2020, 6:27 pm
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్లోని కోవిడ్ కేర్ సెంటర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. రమేష్ ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కొడాలి రాజగోపాల్‌రావుతో పాటు జనరల్ మేనేజర్ కూరపాటి సుదర్శన్, నైట్ మేనేజర్ వెంకటేష్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. హోటల్‌ నిర్వాహకులతో రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం చేసుకున్న ఒప్పంద పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Samayam Telugu విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ అగ్ని ప్రమాదం


కాగా, స్వర్ణ ప్యాలెస్‌లో రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం నిర్వహిస్తున్న ప్రైవేట్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలయ్యారు.

ఈ దుర్ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రెండు క‌మిటీల‌ను ఏర్పాటు చేసింది. స్వర్ణ ప్యాలెస్‌తో పాటు ప్రైవేటు ఆసుపత్రుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంట‌ర్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. భ‌ద్రతా ప్రమాణాల‌పై 48 గంట‌ల్లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు ఈ దుర్ఘటనపై ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.