యాప్నగరం

సీఎం జగన్‌తో దివ్య తల్లిదండ్రుల భేటీకి ఏర్పాట్లు.. హోం మంత్రి ప్రత్యేక చొరవ!

విజయవాడలో దారుణ హత్యకు గురైన దివ్య తేజస్విని తల్లిదండ్రులు సీఎం జగన్‌తో భేటీ కాబోతున్నారు.

Samayam Telugu 19 Oct 2020, 11:45 pm
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విజయవాడ ఇంజనీరింగ్‌ విద్యార్థిని వంకాయలపాటి దివ్య తేజస్విని హత్య కేసులో రోజుకో ట్విస్ట్‌ వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో నిందితుడు నాగేంద్ర ఓ ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటున్నాడు. నాగేంద్రను కఠినంగా శిక్షించాలంటూ దివ్య తల్లిదండ్రులు ఇప్పటికే రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరితను కోరారు.
Samayam Telugu దివ్య తేజస్విని, సీఎం జగన్


అయితే, మంగళవారం దివ్య తల్లిదండ్రులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలవబోతున్నారు. రాష్ట్ర హోం మంత్రి సుచరితతో కలిసి సీఎం జగన్‌ను కలవబోతున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలుస్తారు. సీఎం జగన్‌ను కలిసే ఏర్పాటు చేయాలని రెండ్రోజుల క్రితం పరామర్శించడానికి వెళ్లిన హోం మంత్రిని దివ్య కుటుంబ సభ్యులు అభ్యర్థించారు. దివ్య తల్లిదండ్రుల విజ్ఞప్తితో సీఎంను కలిసేందుకు మంత్రి ప్రత్యేకంగా చొరవ చూపారు. ఈ తరుణంలో దివ్య తల్లిదండ్రులను కలవడానికి మంగళవారం మధ్యాహ్నం సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

హోంమంత్రి సమక్షంలో కలిసి జరిగిన అన్యాయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి వారు తీసుకెళ్లనున్నారు. కాగా, తేజస్వి హత్య కేసులో ఇప్పటికే దూకుడుగా అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.