యాప్నగరం

ఏపీలో మళ్లీ కరోనా పంజా: ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. నెల గ్యాప్‌లో!

ఏపీలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. ఈ తరుణంలో ఒకే కుటుంబంలో నలుగురు మరణించారు.

Samayam Telugu 1 Nov 2020, 3:12 pm
కరోనా వైరస్ మహమ్మారి ఏపీలో విలయతాండవం చేస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టిందని అందరూ భావిస్తున్న తరుణంలో మళ్లీ పంజా విసురుతోంది. చలికాలం మొదలైన తరుణంలో కరోనా రెండో దశ ప్రారంభమవుతుందని ప్రభుత్వం ఇటీవలే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో విజయవాడలో ఓ న్యాయవాది కుటుంబంలో నెల రోజుల్లోనే నలుగురు కరోనా బారినపడి మృతి చెందారు.
Samayam Telugu ఏపీ కరోనా కేసులు


ఈ సంఘటన స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేపింది. కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవని ఈ ఘటన రుజువు చేసింది. విజయవాడకు చెందిన ప్రముఖ న్యాయవాది తల్లి అక్టోబర్ 8వ తేదీన మరణించింది. అక్టోబర్ 30వ తేదీన న్యాయవాది భార్య మరణించింది. భార్య అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలోనే న్యాయవాది కూడ మరణించాడు. ఈ ముగ్గురూ కరోనా బారినపడే మరణించారు.

ఈ తరుణంలో కరోనాతో బాధపడుతున్న న్యాయవాది కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. నెల రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కరోనాతో మరణించడంతో బంధు మిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.