యాప్నగరం

విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం మళ్లీ వాయిదా.. కానీ!

ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్‌ వాస్తవానికి ఈనెల 4న క‌న‌క‌దుర్గ వంతెనను ప్రారంభించాల్సి ఉంది.. కానీ చివరి నిమిషంలో వాయిదా పడింది. మళ్లీ 18న జరగాల్సి ఉండగా.. మరోసారి వాయిదా పడింది.

Samayam Telugu 17 Sep 2020, 2:49 pm
విజయవాడవాసులు ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం వాయిదాపడింది. ఈ విషయాన్ని విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ ద్వారా తెలిపారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా రావడంతో శుక్రవారం జరగబోయే కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం వాయిదా పడినట్లు తెలిపారు. కానీ ప్రజా అవసరాల దృష్ట్యా కనకదుర్గ ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ రేపటి నుండి వదలటం జరుగుతుంది అన్నారు.
Samayam Telugu విజయవాడ ఫ్లై ఓవర్

ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్‌ వాస్తవానికి ఈనెల 4న క‌న‌క‌దుర్గ వంతెనను ప్రారంభించాల్సి ఉంది.. కానీ చివరి నిమిషంలో వాయిదా పడింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సోమవారం మరణించడంతో ప్రభుత్వం ఐదు రోజుల పాటు సంతాప దినాలుగా పాటిస్తోంది. దీంతో ఈ ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. మళ్లీ సెప్టెంబర్ 18న ప్రారంభించాలనుకున్నారు.. కానీ గడ్కరీకి కరోనా తేలడంతో ఆగిపోయింది.

విజయవాడ ఫ్లై ఓవ‌ర్ ప్రారంభంతో పాటు అదే రోజు రూ. 7,584 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులకు భూమి పూజతో పాటు 887 కిలోమీటర్లు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేయనున్నారు. రూ. 8,083 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులను కేంద్రమంత్రి గడ్కరీతో క‌లిసి సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేయాల్సింది. రూ.502 కోట్ల వ్యయంతో ఈ వంతెనను నిర్మించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.