యాప్నగరం

షాకింగ్ వీడియో: ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండ చరియలు.. సీసీ ఫుటేజ్

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం సమీపంలో విరిగిపడ్డ కొండ చరియలు.. ఆ పక్కనే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైన సీన్.

Samayam Telugu 22 Oct 2020, 10:10 am
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి సమీపంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బీటలు వారి కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. కొండ చరియలు విరిగిపడటంతో ఓ రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది ఆ బండలను తొలగించారు. కొండ చరియలు విరిగిపడటం దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

దసరా ఉత్సవాలను పురస్కరించుకుని కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంద్రకీలాద్రికి వచ్చే ముందే‌ ఆ ప్రదేశంలో రాకపోకలు నిలిపివేయడంతో పెనుప్రమాదం తప్పింది. కొండ చరియలు విరిగిపడటంపై మీడియా హెచ్చరించినా.. అధికారులు కేవలం హెచ్చరిక బోర్డులు పెట్టి వదిలేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత ముఖ్యమంత్రి జగన్ ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.