యాప్నగరం

విజయవాడ: కరోనా భయంతో వ్యక్తి పరారీ.. చివర్లో ట్విస్ట్

విజయవాడకు చెందిన శ్రీనివాసరావు జర్వంతో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్లు వైద్యం అందించకపోవడంతో ఆయన కోవిడ్‌ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత తనకు కరోనా పాజిటివ్‌ వస్తుందనే భయంతో ఈ నెల 4న శ్రీనివాసరావు ఇంటి నుంచి పరారీ అయ్యారు.

Samayam Telugu 10 Jul 2020, 11:28 am
కరోనా భయం అందర్నీ వెంటాడుతోంది. ఈ వైరస్ లక్షణాలైన జ్వరం, జలుబు, దగ్గు కనిపిస్తే చాలు జనాలు వణికిపోతున్నారు.. ఆస్పత్రులకు పరుగుతీస్తున్నారు. కొంతమంది భయంతో ప్రాణాలు తీసుకుంటున్నారు.. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. తాజాగా విజయవాడలో ఓ వ్యక్తి కరోనా భయంతో ఇల్లు వదిలి పారిపోయాడు.. ఆరు రోజులుగా ఎవరికీ కనిపించకుండా పోయాడు.
Samayam Telugu కరోనా భయంతో పరాారీ


విజయవాడకు చెందిన శ్రీనివాసరావు జర్వంతో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్లు వైద్యం అందించకపోవడంతో ఆయన కోవిడ్‌ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత తనకు కరోనా పాజిటివ్‌ వస్తుందనే భయంతో ఈ నెల 4న శ్రీనివాసరావు ఇంటి నుంచి పరారీ అయ్యారు. తన భర్త ఆచూకీ కనిపెట్టాలని అతడి భార్య పటమట పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇదిలా ఉంటే శ్రీనివాసరావుకు కరోనా టెస్టుల్లో నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. అతడి భార్య ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసులు నమోదు చేసి.. అతడి కోసం గాలిస్తున్నారు. ఏడు రోజులుగా పోలీసులు గాలిస్తున్నా అతడి ఆచూకీ మాత్రం దొరకడం లేదు. ఇప్పటివరకు ఆ వ్యక్తి ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. ఇటు కర్నూలులో కూడా ఓ వ్యక్తి కరోనా భయంతో ప్రాణాలు తీసుకున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.