ఏపీ రాజకీయాలు మొత్తం కృష్ణా నది వరద, రాజధాని తరలింపు చుట్టూ తిరుగుతోంది. అధికార పార్టీ వైసీపీ-ప్రతిపక్షం టీడీపీల మధ్య చిచ్చు రేపింది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు సవాళ్లు వరకు వెళ్లింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనపై ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలపై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఘాటుగా స్పందించారు. విజయసాయికి సవాల్ విసిరారు. Read Also: రైతులను మోసం చేసి భూముల్ని కొన్నారు.. విజయసాయి మరో ట్విస్ట్!
‘విజయ సాయి రెడ్డి గారు నాకు గాని నా కుటుంబానికి కాని నాకు సంబంధించిన వారికి కాని అమరావతి లో ఒక్క అంగుళం భూమి వుందని రుజువు చేస్తే ప్రభుత్వానికి వ్రాసి ఇస్తా లేకుంటే మీరేమి చేస్తారో కొంచం చెబుతారా’అంటూ ప్రశ్నించారు. భూమి ఉందని నిరూపిస్తే ప్రభుత్వానికే రాసిస్తానంటూ సవాల్ విసిరారు విజయవాడ ఎంపీ.
విజయసాయిరెడ్డి తన ట్వీట్లో ‘అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకే ముంపుకు గురిచేశారని గగ్గోలు పెడుతున్నవారెవరో గమనించారా? చంద్రబాబు, సుజనా, కేశినేని, సిఎం రమేశ్, లోకేశ్, కోడెల, ఉమ, వీళ్ల బినామీలు, “కావాల్సిన” వాళ్లు వేల ఎకరాల భూములు రైతులను మోసం చేసి కొన్నారు. రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతాయన్నదే వీరి ఏడుపు’అంటూ విజయసాయి టీడీపీ నేతల్ని టార్గెట్ చేశారు. ఈ ట్వీట్కే కేశినేని కౌంటరిచ్చారు.
‘విజయ సాయి రెడ్డి గారు నాకు గాని నా కుటుంబానికి కాని నాకు సంబంధించిన వారికి కాని అమరావతి లో ఒక్క అంగుళం భూమి వుందని రుజువు చేస్తే ప్రభుత్వానికి వ్రాసి ఇస్తా లేకుంటే మీరేమి చేస్తారో కొంచం చెబుతారా’అంటూ ప్రశ్నించారు. భూమి ఉందని నిరూపిస్తే ప్రభుత్వానికే రాసిస్తానంటూ సవాల్ విసిరారు విజయవాడ ఎంపీ.