యాప్నగరం

Chandrababu Naidu ఢిల్లీ పర్యటనలో ఆసక్తికర సీన్.. పుష్పగుచ్చాన్ని విసురుగా కొట్టిన ఎంపీ నాని

Chandrababu Naidu Delhi Tour లో ఆసక్తికర సీన్. చంద్రబాబుకు పుష్ప గుచ్చం ఇచ్చేందుకు నిరాకరించిన ఎంపీ కేశినేని నాని. చంద్రబాబుకు దూరంగా ఉన్న విజయవాడ ఎంపీ.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 6 Aug 2022, 10:53 am

ప్రధానాంశాలు:

  • టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన
  • ఘన స్వాగతం పలికిన టీడీపీ ఎంపీలు, నేతలు
  • బొకే ఇవ్వకుండా విసురుగా కొట్టిన ఎంపీ కేశినేని
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Kesineni Nani
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన (Chandrababu Naidu Delhi Tour)లో విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) తీరు హాట్ టాపిక్ అయ్యింది. చంద్రబాబుకు ఎయిర్‌పోర్టులో ఎంపీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించి పుష్ప గుచ్చం అందించారు. ఈ క్రమంలో ఎంపీ గల్లా జయదేవ్ గుచ్చాన్ని అధినేతకు అందివ్వాలని ఎంపీ కేశినేని నాని చేతికి ఇవ్వబోయారు. కానీ నాని పుష్పగుచ్చాన్ని విజయవాడ ఎంపీ విసురుగా కొట్టారు. దీంతో నాని తీరు చర్చనీయాంశమైంది. అంతేకాదు నాని చంద్రబాబుకు దూరంగా ఉన్నారు. ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబుపై నేరుగా అసహనం ప్రదర్శించారని చర్చించుకుంటున్నారు. చంద్రబాబుకు బొకే ఇచ్చేందుకు కేశినేని నిరాకరించడంపై ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. బొకే ఇవ్వాలని ఎంపీ గల్లా జయదేవ్ బతిమిలాడిన ఏమాత్రం పట్టించుకోలేదు.
కొద్దిరోజులుగా కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తన ఎంపీ స్టిక్కర్‌ను కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారని పోలీసులకు నాని ఫిర్యాదు చేశారు. నేరుగా తమ్ముడు చిన్నిని టార్గెట్ చేశారు. ఈ క్రమంలో నాని తమ్ముడు మరింత దూకుడు పెంచారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను కలిశారు. తన పుట్టిన రోజు సందర్భంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో కొన్ని కార్యక్రమాలు చేశారు. ఈ క్రమంలోనే తమ్ముడిని టీడీపీ అధిష్టానం ప్రోత్సహిస్తోందని నాని అసహనంతో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అయితే ఇటీవల కేశినేని నాని కుమార్తె శ్వేత నిశ్చితార్థ వేడుకకు చంద్రబాబుతో పాటూ లోకేష్‌లు హాజరయ్యారు. అప్పుడు కూడా నాని అందరినీ పలకరిస్తూ ఉత్సాహంగా కనిపించారు.. కానీ ఇంతలోనే అధినేత ఢిల్లీ పర్యటనలో జరిగిన ఈ సన్నివేశం ఆసక్తికరంగా మారింది.

మరోవైపు చంద్రబాబు రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక మందిరంలో ఆజాదీ కా అమృతోత్సవ్‌ నేషసనల్ కమిటీ కార్యక్రమంలో పాల్గొంటారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర మహోత్సవాల సందర్భంగా.. ఆజాదీ కా అమృత్ ఉత్సవాలను కేంద్రం నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఆజాదీ కా అమృతోత్సవ్‌ నేషనల్ కమిటీ సమావేశానికి చంద్రబాబుకు కేంద్రం నుంచి ఆహ్వానం అందడంతో వచ్చారు.

అలాగే మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలనున్నట్లు సమాచారం. సాయంత్రం మళ్లీ హైదరాబాద్ చేరుకుంటారు. ప్రధాని అధ్యక్షతన జరిగే ఈ నేషనల్ కమిటీ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లతోపాటు ప్రముఖ రాజకీయ నేతలు, క్రీడాకారులు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించారు. మొత్తం 240 మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. ఇటు ఏపీ సీఎం జగన్ కూడా హస్తిన పర్యటనకు వెళుతున్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.