ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ను ఏర్పాటు చేసి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న వారి ఆటకట్టిస్తున్నా మందుబాబులు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. మద్యం తరలించేందుకు మందుబాబులు సరికొత్త పద్ధతులు వెతుక్కుంటున్నారు. అక్రమంగా మద్యం తరలించేందుకు వీళ్లు చూపిస్తున్న క్రియేటివిటీకి పోలీసులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా, కృష్ణా జిల్లాలో మందుబాబులు అత్యంత తెలివిగా గ్యాస్ సిలిండర్నే ‘ఆయుధం’గా మార్చుకున్నా పోలీసులు మాత్రం వీరి ఆటలు సాగనివ్వలేదు.
కృష్ణా జిల్లాలోని చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ళ వాసు, ఉప్పుతోళ్ళ గోపి, నందిగామ గ్రామానికి చెందిన యలగుందుల ఉదయ్ శ్రీను కలిసి మద్యం బాటిళ్లను గ్యాస్ సిలిండర్లో పెట్టి అక్రమ రవాణా చేస్తుండగా జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ముగ్గురు తెలంగాణ రాష్ట్రం నుంచి మద్యం బాటిళ్లను గ్యాస్ సిలిండర్లో పెట్టి తరలిస్తుండగా ఆకస్మికంగా తనిఖీలు చేసిన పోలీసులు పట్టుకున్నారు.
వీరి వద్ద నుంచి 100 మద్యం బాటిల్స్, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురిపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎస్ఎల్ఆర్ సోమేశ్వర రావు వెల్లడించారు.
కృష్ణా జిల్లాలోని చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ళ వాసు, ఉప్పుతోళ్ళ గోపి, నందిగామ గ్రామానికి చెందిన యలగుందుల ఉదయ్ శ్రీను కలిసి మద్యం బాటిళ్లను గ్యాస్ సిలిండర్లో పెట్టి అక్రమ రవాణా చేస్తుండగా జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ముగ్గురు తెలంగాణ రాష్ట్రం నుంచి మద్యం బాటిళ్లను గ్యాస్ సిలిండర్లో పెట్టి తరలిస్తుండగా ఆకస్మికంగా తనిఖీలు చేసిన పోలీసులు పట్టుకున్నారు.
వీరి వద్ద నుంచి 100 మద్యం బాటిల్స్, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురిపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎస్ఎల్ఆర్ సోమేశ్వర రావు వెల్లడించారు.