యాప్నగరం

సొంత పార్టీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన జగన్ సర్కారు..

చంద్రబాబు నాయుడు ఇసుక దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. దానికి సమీపంలోనే తాను కూడా దీక్ష చేస్తానని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ప్రకటించారు. కానీ ఆయన దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది.

Samayam Telugu 13 Nov 2019, 7:38 pm
ఏపీలో ఇసుక కొరతకు కారణం వైఎస్ఆర్సీపీనే అని ఆరోపిస్తున్న చంద్రబాబు.. గురువారం విజయవాడలో దీక్షకు దిగుతున్నారు. 12 గంటలపాటు ఆయన దీక్ష చేపడుతున్నారు. బాబు చేపడుతున్న ఇసుక దీక్షకు పోటీగా తాను కూడా దీక్ష చేపడతానని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పార్థసారథి ప్రకటించారు. బాబు దీక్ష వేదికకు సమీపంలోనే తాను కూడా నిరసన చేపడతానన్నారు. చంద్రబాబు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
Samayam Telugu jagan cm


ధర్నా చౌక్ వద్ద తన దీక్షకు అనుమతించాలని హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులను పార్థసారథి కోరారు. నగర పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. కాగా ఆయన దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఉద్రిక్తతలకు తావివ్వొద్దనే కారణంతోనే జగన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.

మున్సిపల్ స్టేడియంలో దీక్ష చేపట్టాలని తొలుత చంద్రబాబు నాయుడు భావించారు. కానీ ప్రభుత్వం అందుకు అనుమతించలేదు. ఈ స్టేడియంలో ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేశారు. దీంతో దీక్ష వేదికను ధర్నా చౌక్‌కు మార్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.