యాప్నగరం

విజయవాడ పోలీసుల మంచి మనసు.. వలస కూలీల కోసం

విజయవాడ పోలీసులు భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గొల్లపూడి వై జంక్షన్ దగ్గర చలివేంద్రం ఏర్పాటు చేశారు. అంతేకాదు కూలీలకు చెప్పుల వితరణ కేంద్రాన్ని ప్రారంభించారు.

Samayam Telugu 18 May 2020, 7:36 am
కరోనా, లాక్‌డౌన్‌తో వలస కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కోల్పోయిన కార్మికులు సొంత గ్రామాలకు తరలి వెళుతున్నారు.. సైకిళ్లు, కాలినడక బయల్దేరారు. కూలీల సమస్యలు చూసి చలించిన ఏపీ సీఎం జగన్.. మానవీయ కోణంలో వ్యవహరించాలని అన్ని శాఖలను ఆదేశించారు. దీనిపై వెంటనే స్పందించిన విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు ఐపీఎస్ క్షేత్ర స్థాయిలో సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
Samayam Telugu విజయవాడ పోలీసులు


విజయవాడ పోలీసులు భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గొల్లపూడి వై జంక్షన్ దగ్గర చలివేంద్రం ఏర్పాటు చేశారు. అంతేకాదు కూలీలకు చెప్పుల వితరణ కేంద్రాన్ని ప్రారంభించారు. తమిళనాడు నుంచి కాలినడకన యూపీ, పశ్చిమ బెంగాల్ వెళుతున్న 38 మంది వలస కార్మికులను గొల్లపూడి వై జంక్షన్ వద్ద ఆపి వారికి మంచినీళ్లు, నిమ్మ నీరు, మజ్జిగ పాకెట్స్, గ్లూకోస్ పాకెట్స్ అందించారు.

కూలీలు వారి సొంత ఊళ్లకు చేరుకునే క్రమంలో వారు చేస్తున్న ప్రమాదకర ప్రయాణాన్ని చూసి చలించిన విజయవాడ సీపీ వారందరికీ కొత్త చెప్పుల జతలను అందజేశారు. కూలీలతో సీపీ కొద్దిసేపు మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకొని.. వారు స్వస్థాలకు వెళ్లే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. వలస కార్మికుల విషయంలో పోలీసులు మానవీయ కోణంలో వ్యవహరించాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.