యాప్నగరం

విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో ట్విస్ట్.. పోలీసుల సంచలన నిర్ణయం

గొడవలకు దిగిన సందీప్, పండు గ్యాంగుల్ని నగర నుంచి బహిష్కరణ చేయాలని నిర్ణయించారు. ఈ రెండు గ్యాంగుల్ని నగరం నుంచి బహిష్కరిస్తూ డీసీపీ హర్షవర్ధన్ ఆదేశాలు జారీ చేశారు.

Samayam Telugu 15 Jun 2020, 12:47 pm
విజయవాడ గ్యాంగ్ కేసులో పోలీసుల సంచలన నిర్ణయం తీసుకున్నారు. గొడవలకు దిగిన సందీప్, పండు గ్యాంగుల్ని నగర నుంచి బహిష్కరణ చేయాలని నిర్ణయించారు. ఈ రెండు గ్యాంగుల్ని నగరం నుంచి బహిష్కరిస్తూ డీసీపీ హర్షవర్ధన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండు గ్యాంగుల్లో ఉన్న అందరూ నగరం విడిచి వెళ్లాలని ఆదేశించారు. కొత్త సీపీగా శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించిన రోజే పోలీసులు సంచలన నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.
Samayam Telugu విజయవాడ గ్యాంగ్ వార్


ఇప్పటి వరకు 37 మందిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో 13 మంది కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో పండు గ్యాంగ్‌కు చెందిన 17 మంది, సందీప్ కుమార్ గ్యాంగుకు చెందిన 16 మందిని అరెస్ట్ చేశారు. పండు, సందీప్ గ్యాంగ్‌ల మధ్య గొడవకు కారణమైన బిల్డర్లు ధనేకుల శ్రీధర్, ప్రదీప్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరిస్తానని చెప్పి ఒప్పందం కుదుర్చున్న భట్టు నాగబాబును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం అదుపులోకి తీసుకున్న పండు, నాగబాబు, ప్రదీప్‌రెడ్డిలను పోలీసులు కోర్టులో హాజరు పరుస్తారు.

మరోవైపు విజయవాడ పోలీస్ కమిషనర్‌గా బత్తిన శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం సీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావు రైల్వేకు బదిలీ కాగా.. ఆయన ఆ స్థానంలో నియమితులయ్యారు. నాలుగు నెలలుగా నగరంలో అదనపు సీపీగా పనిచేస్తున్నానని.. ఇక్కడ గతంలో 15 నెలలు సీపీగా, అంతకు ముందు పశ్చిమ జోన్ ఏసీపీగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. పోలీసులు ప్రజలకు మరింత చేరువవ్వాలని.. త్వరితగతిన న్యాయం జరిగేలా, మరింత బాధ్యతాయుతంగా సేవలందించేలా చర్యలు తీసుకుంటాను అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.