యాప్నగరం

బస్సులో అర్ధరాత్రి కీచకపర్వం.. కామాంధులకు దిమ్మతిరిగేలా..

అర్ధరాత్రి బస్సులో మహిళపై వేధింపులకు పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులపై పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఘటన జరగగా, విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు.

Samayam Telugu 18 Feb 2020, 6:17 pm
అర్ధరాత్రి బస్సులో కీచకపర్వానికి పాల్పడ్డ ఇద్దరికి పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. జీరో ఎఫ్‌ఐఆర్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకోగా కృష్ణా జిల్లా పోలీసులు నిందితుల ఆటకట్టించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ ప్రైవేటు బస్సులో మహిళ పట్ల ఇద్దరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారు.
Samayam Telugu rape1


Also Read: గుంటూరులో వివాహితపై గ్యాంగ్ రేప్.. నడిరోడ్డుపై నగ్నంగా పరిగెత్తుతూ..

పశ్చిమ గోదావరి జిల్లా కలపర్రు వద్ద ఈ ఘటన చోటుచేసుకోగా.. కృష్ణా జిల్లా విజయవాడలోని హనుమాన్‌ జంక్షన్‌ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో అర్ధరాత్రి 11 గంటల సమయంలో జీరో ఎఫ్‌ఐఆర్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

నిందితులు పశ్చిమ గోదావరి జిల్లా నారాయణపురంకు చెందిన యజ్జల దర్బార్, అతని కుమారుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం నిందితులను మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా హనుమాన్‌ జంక్షన్‌ పోలీసులను నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు. జీరో ఎఫ్‌ఐఆర్‌తో మహిళలకు అదనపు భద్రత లభిస్తుందని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.