యాప్నగరం

శభాష్ బెజవాడ పోలీస్.. ఐడియా అదిరిపోయింది

నిత్యావసరాల కోసం గుంపులు, గుంపులుగా వచ్చిన జనాలు.. ముందస్తు జాగ్రత్తగా పోలీసుల చర్యలు. షాపులు, మార్కెట్ల ముందు జనాలు గుంపులుగా లేకుండా విజయవాడ పోలీసుల వినూత్న ఆలోచన.

Samayam Telugu 23 Mar 2020, 11:44 am
కరోనా కట్టడికి తెలుగు రాష్ట్రాలు నడుం బిగించాయి. ఆ మహమ్మారిని అరికట్టేందుకు లాక్‌డౌన్ ప్రకటించాయి. ఈ నెల 31 వరకు అప్రకటిత కర్ఫ్యూ కనిపించనుంది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను కూడా అనుమతించడం లేదు. అత్యవసరమైన వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ప్రజలెవరూ బయటకు రావొద్దని నిత్యావసర వస్తువుల కోసం కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. జనాలెవరూ గుంపులుగా ఉండొద్దని హెచ్చరిస్తున్నారు. పోలీసులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
Samayam Telugu vja.


Also Read: ఖతర్ నుంచి 37 మంది.. కర్ణాటక-తెలంగాణ సరిహద్దులో అడ్డగింత.. బాధితులంతా ఏపీ వారే..

ఇదిలా ఉంటే విజయవాడతో పాటూ కృష్ణా జిల్లాలో సోమవారం ఉదయం ప్రజలు నిత్యావసరాల కోసం రోడ్లపైకి వచ్చారు. ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ కావడంతో ముందు జాగ్రత్తగా నిత్యావసరాలను తీసుకెళ్లాలనే తొందరపాటు వారిలో కనిపించింది. జనాలు ఇలా ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జనాలను కంట్రోల్ చేసేందుకు వినూత్నమైన ఆలోచనతో ముందుకు వెళుతున్నారు. జనాలు గుంపులు, గుంపులుగా లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు.

గన్నవరం, గవర్నరు పేటతో పాటూ మరికొన్ని ప్రాంతాల్లో పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కిరాణా షాపులు, కూరగాయల మార్కెట్‌లు, టీ స్టాల్స్ ముందు ముగ్గుతో సర్కిల్స్ గీశారు.. ఒక్కొక్కరినే అనుమతిస్తున్నారు. నిత్యావసరాల కోసం వచ్చేవారు ఒకే చోట గుమికూడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తున్నారు.. తమవంతు బాధ్యతగా ఆ సర్కిల్స్‌లో నిలబడి ఒకరి తర్వాత మరొకరు నిత్యావసరాలు, సరుకులు తీసుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.