యాప్నగరం

TDP లో తీవ్ర విషాదం: ఒకే రోజు ఇద్దరు సీనియర్ నేతలు మృతి.. లోకేష్ భావోద్వేగం

TDP Ex Corporators Death: తెలుగు దేశం పార్టీలో సోమవారం తీవ్ర నిండింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు కన్నుమూశారు.

Samayam Telugu 14 Dec 2020, 2:57 pm
తెలుగు దేశం పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు కన్నుమూశారు. విజయవాడకు చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు ఒకే రోజు మృతి చెందడంతో పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆవేదనలో కూరుకుపోయారు. టీడీపీ మాజీ కార్పొరేటర్లు ఆత్కూరి రవికుమార్, గోపర్తి నరసింహారావు సోమవారం కన్నుమూశారు. దీంతో ఇద్దరి నేతల మరణంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర భావోద్వేగం చెందారు. వీరి మరణం పార్టీకి తీరలి లోటని పేర్కొన్నారు. ఈ మేరకు నారా లోకేష్ ట్వీట్ చేశారు.
Samayam Telugu నారా లోకేష్


‘‘విజయవాడ తెలుగుదేశం పార్టీ నాయకులు, మధురానగర్ మాజీ కార్పొరేటర్ ఆత్కూరి రవికుమార్ గారి ఆకస్మిక మరణం బాధాకరం. వారి మరణం పార్టీకి తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూన్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను’’.
అలాగే ‘‘విజయవాడ తెలుగుదేశం నాయకులు, కృష్ణలంక మాజీ కార్పొరేటర్ గోపర్తి నరసింహారావు గారు కోవిడ్ మహమ్మారికి గురై మరణించడం బాధాకరం. వారి మరణం పార్టీకి తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అంటూ లోకేష్ వరుస ట్వీట్లు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.