యాప్నగరం

విజయవాడ: దిశ నిందితుల ఎన్‌కౌంటర్.. రోజంతా ఫ్రీగా టీ, కాఫీ

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో టీ స్టాల్ యజమాని బంపరాఫర్.. రోజంతా ఉచితంగా కాఫీ, టీ. విజయవాడకు చెందిన టీ స్టాల్ యజమాని సత్యనారాయణ మూర్తి ఇలా తన హర్షాన్ని వ్యక్తం చేశారు.

Samayam Telugu 7 Dec 2019, 1:10 pm
దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత దేశవ్యాప్తంగా అందరూ స్పందించారు. నిందితులకు సరైన శిక్షపడిందని.. తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఘటనపై హోరెత్తింది.. దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. తొలిసారిగా పోలీసులకు స్వీట్లు తినిపించి.. పూల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.
Samayam Telugu four.


ఈ ఎన్‌కౌంటర్‌పై విజయవాడకు చెందిన ఓ టీ స్టాల్ యజమాని సత్యనారాయణమూర్తి ఆనందంతో.. వెరైటీగా తన స్పందనను తెలియజేశారు. ఎన్‌కౌంటర్‌పై హర్షం వ్యక్తం చేస్తూ.. తన టీ స్టాల్ దగ్గరకు వచ్చిన వారికి రోజంతా ఉచితంగా టీ, కాఫీ అందించాడు. రోజంతా తన టీ స్టాల్ దగ్గరకు వచ్చిన వారికి ఫ్రీగా టీ, కాఫీలు ఇస్తానన్నాడు. ఇలా తన సంతోషాన్ని అందరితో పంచుకుంటున్నాను అన్నారు.

సత్యనారాయణ మూర్తి విజయవాడలోని కొత్త ప్రభుత్వాసుపత్రి దగ్గర టీస్టాల్‌ నడుపుతున్నాడు. అతనికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మధ్యతరగతి కుటుంబం అయినా టీ స్టాల్ పెట్టి జీవనం సాగిస్తున్నా.. సత్యనారాయణ మూర్తి తన ఆనందాన్ని ఇలా అందరితో పంచుకున్నారు. ఆయన ఇలా టీ, కాఫీలు ఉచితంగా ఇవ్వడం ఇప్పుడు హాట్‌టాపిక్ అయ్యింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.