యాప్నగరం

విజయవాడ తేజస్విని తండ్రి సంచలన వ్యాఖ్యలు

విజయవాడ దివ్య తేజస్విని హత్యకేసులో దర్యాప్తు ముమ్మరం.. ఆమె తల్లిదండ్రులు, సోదురుడ్ని పోలీసులు విచారణకు పిలిచారు.. ఆమె తండ్రి జోసెఫ్ నిందితుడు నాగేంద్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 17 Oct 2020, 11:27 am
విజయవాడలో సంచలనంరేపిన తేజస్విని హత్యకేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసును విజయవాడ పీఎస్ నుంచి దిశ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. అలాగే దివ్య తల్లిదండ్రులు, సోదురుడ్ని పోలీసులు విచారణకు పిలిచారు.. ఆమె తండ్రి జోసెఫ్ నిందితుడు నాగేంద్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగేంద్రను ఎన్‌కౌంటర్ చేయాలని.. తమకు న్యాయం చేయాలన్నారు. అత్యంత కిరాతకంగా దివ్యను హత్య చేశాడడని.. 13 కత్తి పోట్లే నాగేంద్ర కిరాతకానికి సాక్ష్యమన్నారు.
Samayam Telugu తేజస్విని హత్యకేసు


ఇంట్లో పడుకున్న దివ్యను నిద్రలోనే హతమార్చాడని.. నాగేంద్ర దివ్యను చంపి తను మాత్రం చిన్న గాయాలు చేసుకున్నాడన్నారు. హత్యకేసు నుంచి తప్పించుకోవడానికే మీడియాతో మాట్లాడుతున్నాడని.. దివ్య వివాహం, ఇతర విషయాలు నిజం కాదన్నారు. దివ్యకు నాగేంద్రతో వివాహం అనేది అవాస్తవమన్నారు ఆమె సోదరుడు. దివ్యకు నాగేంద్రతో ఇటీవలే పరిచయం ఏర్పడిందని.. దివ్య తన ఆవేదన, బాధ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని.. నాగేంద్రకు ఎవరు సహకరించారో పోలీసులు గుర్తిస్తారన్నారు.

మరోవైపు పోలీసుల విచారణలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో దివ్య, నాగేంద్ర వివాహంపై అధికారిక ధ్రువీకరణ దొరకలేదంటున్నారు. 2018 మార్చిలో దివ్వ, నాగేంద్ర మంగళగిరి పానకాల స్వామి ఆలయానికి వెళ్లినట్లు తెలుస్తోంది. విచారణలో వివాహమైనట్లు ఏ వివరాలు నమోదు కాలేదంటున్న పోలీసులు..ఆ ఫోటో ఎలా వచ్చిందనే అంశంపై ఆరా తీస్తున్నారు. నాగేంద్రకు సాయం చేసిన మహిళ కూపీ లాగేందుకు కాలేజీకి వెళ్లారు. పోలీసులుయనాగేంద్ర, దివ్య ఫోన్లలో వాట్సాప్, ఫేస్‌బుక్ మెసేజ్‌లను విశ్లేషిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.