యాప్నగరం

ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే గ్రామ వాలంటీర్ ఆత్మహత్య

విధుల్లోకి చేరిన కొద్ది రోజుల్లోనే గ్రామ వాలంటరీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పశ్చిమ్ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. యువతి బలవన్మరణంపై అనుమానాలు వ్యక్తమవుతుాయి.

Samayam Telugu 8 Sep 2019, 10:03 am
గ్రామ వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. జీలుగుమిల్లి మండలం పండువారిగూడెంలో గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తునన పండు నవీన (19) తన ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వాలంటీర్‌గా చేరిన కొద్దిరోజులకే నవీన ఆత్మహత్య చేసుకోవడం వెనుక బలమై కారణం ఏంటనేది తెలియరాలేదు. ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తం కావడంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఆధార్ కార్డు విషయంలో ఓ మహిళ తనను దూషించడంతోనే నవీన ఆత్మహత్యకు పాల్పడిందనే వాదన వినిపిస్తోంది.
Samayam Telugu volunteer


తన ఆధార్‌కార్డులో ఇంటి పేరు మార్చాలంటూ గ్రామానికి చెందిన మంగ కోరితే, నవీన తన పరిధిలోకి రాదని చెప్పిందని పేర్కొంటున్నారు. సవరణలు తన పరిధిలోకి రావని చెప్పినా ఆమె వినిపించుకోకుండా వాగ్వివాదానికి దిగిందని, ఆపై పరుష పదజాలంతో దూషించిందని చెబుతున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నవీన శనివారం ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ దొరికినట్టు నవీన తండ్రి శ్రీరామ్మూర్తి పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్‌లో ఏం రాసిందనేది తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.