యాప్నగరం

కర్నూలు: పింఛన్ డబ్బు నొక్కేసిన గ్రామ వాలంటీర్

గ్రామ వాలంటీర్‌ ప్రవీణ్‌ పింఛను పంపిణీలో పింఛను సొమ్ము ఇవ్వకుండా కాజేశాడు. మరో గ్రామ వాలంటీరు రేషన్‌ కార్డుల మంజూరులో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలు వచ్చాాయి.

Samayam Telugu 11 Aug 2020, 8:29 am
కర్నూలు జిల్లాలో ఓ గ్రామ వాలంటీర్ పింఛన్ సొమ్ము నొక్కేశాడు. మద్దికెర మండలం అగ్రహారం గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్‌ ప్రవీణ్‌ పింఛను పంపిణీలో ఓ వృద్ధునికి పింఛను సొమ్ము ఇవ్వకుండా కాజేశాడు. అతడిపై ఆరోపణలు రుజువు కావడంతో అతనిపై చర్యలు తీసుకున్నామని ఎంపీడీవో నరసింహమూర్తి తెలిపారు. అతడ్ని సస్పెండ్‌ చేశామని.. మరో గ్రామ వాలంటీరు రేషన్‌ కార్డుల మంజూరులో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలతో అతడిపై తహసీల్దారుకు ఫిర్యాదు చేశారు. వారు నివేదిక ఇస్తే అతడిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
Samayam Telugu కర్నూలు


గతంలో కూడా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ఘటనలు జరిగాయి. కొందరు వాలంటీర్లు పింఛన్ సొమ్ము కాజేశారు. అలాంటి వారి విషయంలో ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుంటోంది.. కొందర్ని సస్పెండ్ చేయగా.. మరికొందర్ని పూర్తిగా విధుల్ని నుంచి తప్పిస్తోంది. ఎవరు అవినీతికి పాల్పడినా చర్యలు తప్పవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గతంలోనే తేల్చి చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.