యాప్నగరం

విశాఖ డెయిరీ ఛైర్మన్ కన్నుమూత.. సీఎం జగన్ దిగ్భ్రాంతి

విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. తులసీరావు మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 4 Jan 2023, 10:56 pm
విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తులసీరావు.. హైదరాబాద్‌లోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. తులసీరావు మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. గురువారం ఉదయం తులసీరావు పార్థీవదేహాన్ని ఆయన స్వగ్రామమైన యలమంచిలికి తరలించనున్నారు.
Samayam Telugu విశాఖ డెయిరీ ఛైర్మన్ కన్నుమూత (ఫైల్ ఫొటో)


1939 ఫిబ్రవరి 1న అనకాపల్లి జిల్లా యలమంచిలిలో వెంకటరామయ్య, సీతయ్యమ్మ దంపతులకు తులసీరావు జన్మించారు. సుమారు 35 సంవత్సరాల పాటు విశాఖ డైరీ ఛైర్మన్‌గా కొనసాగిన ఆయన.. విశాఖ డెయిరీని ప్రగతి పథంలో నడిపించారు. రైతుల కోసం విశాఖ డెయిరీ తరఫున కృషి ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.

విశాఖ డెయిరీ ఛైర్మన్‌ తులసీరావు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆడారి తులసీరావు డెయిరీ రంగానికి ఎనలేని సేవ చేశారని గుర్తు చేశారు. తులసీరావు కుటుంబ సభ్యులకు సీఎం జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.