విశాఖలో ప్రేమ చిచ్చు: కూతురు కేసు పెట్టిందని తండ్రి ఆత్మహత్య!
Visakhapatnam: కన్నకూతురు తనపై పోలీసు కేసు పెట్టడంతో మనస్తాపంతో తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Samayam Telugu 19 Oct 2020, 5:34 pm
విశాఖపట్నం జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కన్న కూతురి ప్రేమ వివాదంతో మనస్తాపంతో ఓ తండ్రి ప్రాణాలు తీసుకున్నాడు. విశాఖపట్నం జిల్లాలోని కొత్తపల్లికి చెందిన వెంకట రమణ అనే వ్యక్తికి ఓ కూతురు సంతానం. ఓ యువకుడు, వెంకట రమణ కూతురు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇద్దరి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. ఈ తరుణంలో ఈ నెల 13వ తేదీన ఆ యువకుడు వెంకటరమణ ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. దీంతో యువకుడిపై వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ విషయం తెలుసుకున్న కూతురు తన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి కూతురు తన తండ్రిపై కేసు పెట్టింది. దీంతో వెంకట రమణ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కూతురే తనపై కేసు పెట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటరమణ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
ఈ విషయం తెలుసుకున్న కూతురు తన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి కూతురు తన తండ్రిపై కేసు పెట్టింది. దీంతో వెంకట రమణ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కూతురే తనపై కేసు పెట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటరమణ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.